నేటి నుంచి పది రోజుల పాటు వికారాబాద్ బంద్
లాక్డౌన్ సడలింపుల తరువాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో కేసులు పెరుగుతున్న ప్రదేశాల్లో అక్కడి అధికారులు మళ్లీ లాక్డౌన్ను పెడుతూ వస్తున్నారు.
లాక్డౌన్ సడలింపుల తరువాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో కేసులు పెరుగుతున్న ప్రదేశాల్లో అక్కడి అధికారులు మళ్లీ లాక్డౌన్ను పెడుతూ వస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ను ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా వికారాబాద్లోని వ్యాపారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వికారాబాద్లో పది రోజుల పాటు స్వచ్ఛంద బంద్ ఉండనుంది. కరోనా కేసులు ఎక్కువ అవుతున్నందున.. పది రోజుల పాటు పట్టణంలోని అన్ని షాపులను మూసివేస్తున్నట్లు వికారాబాద్ పట్టణ వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.