Telangana: ఛీ.. ఛీ.. పాడి ఆవుపై పైశాచికం.. తిట్టడానికి కూడా మాటలు రావట్లేదు కదరా..

|

Mar 31, 2022 | 7:28 PM

ఛీ.. కొందరి మనుషులు ప్రవర్తన చూస్తుంటే.. తిట్టడానికి కూడా మాటలు రావడం లేదు. పశువులపై కూడా పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు క్రూరులు. సభ్యసమాజం తల దించుకునేలా దారుణాలకి తెగబడుతున్నారు.

Telangana: ఛీ.. ఛీ.. పాడి ఆవుపై పైశాచికం.. తిట్టడానికి కూడా మాటలు రావట్లేదు కదరా..
Rape On Cow
Follow us on

ఎవరైనా తప్పుగా దిగజారి ప్రవర్తిస్తే ..  ‘ఛా.. వీడి కంటే పశువే నయం అంటాం’. అయితే ఇలాంటి పదం వాడితే పశువులను కూడా కించపరిచినట్లు అవుతుందేమో. అవును కొందరు ఉన్నాదుల ప్రవర్తన అంత అసహ్యం వేసేలా ఉంది. తాజాగా తెలంగాణలో పాడి ఆవుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.. కాదు.. కాదు క్రూరుడు.. నీచుడు. సభ్య సమాజం తల దించుకునే విధంగా ప్రవర్తించాడు. అతడు చేసిన పాపపు పనికి ఆ మూగ జీవి అశువులు బాసింది. ఈ దారుణ ఘటన నిర్మల్​ జిల్లా(nirmal district) లోకేశ్వరం మండలం(Lokeswaram Mandal) పిప్రి గ్రామం(pipri village)లో చోటుచేసుకుంది.  గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఈ క్రమంలో టైల్స్​ వేసేందుకు ఉత్తరప్రదేశ్​కు చెందిన విజయ్ (20) అనే యువకుడిని పనికి పిలిచాడు. రోజూ తన పని తాను చేసుకుపోతున్న విజయ్​.. మార్చి 29 రాత్రి క్రూరంగా ప్రవర్తించాడు. ఫూటుగా మద్యం సేవించి.. ఆ మత్తులో అక్కడే సంచరిస్తున్న ఆవును చూశాడు. ఆపై అతడి మనసులో దారుణ ఆలోచన మెదిలింది. సైకో కంటే దారుణంగా ఆలోచించాడు. నిర్మాణ దశలో ఉన్న ఇంటిలోని ఒక కిటికీకి ఆవును కట్టేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మూగ జీవిపై దారుణంగా ప్రవర్తించాడు. అతడి ప్రవర్తనతో బిత్తరపోయిన ఆవు.. తప్పించుకునేందుకు యత్నించింది. ఈ క్రమంలో కిటికీకి కట్టేసిన తాడు.. ఆవు మెడకు గట్టిగా చుట్టుకోవడంతో ఊపిరాడక మృతి చెందింది.

పొద్దున్నే యజమాని వచ్చి చూడగా.. బయట ఆవు కనిపించలేదు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. అది విగత జీవిగా కనిపించింది. వెంటనే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరకున్న పోలీసులు..  రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ రైతు ఆవుకు హిందూ సంప్రదాయం ప్రకారం.. అత్యక్రియలు నిర్వహించాడు.

Also Read: Hyderabad: సంచలనం.. హైదరాబాద్‌లో డ్రగ్స్ వల్ల తొలి మరణం.. మరో 8 మంది..