Telangana: పంచాయతీ పోరుపై కాంగ్రెస్‎లో కొత్త చిచ్చు.. ప్రభుత్వం నిర్ణయంపై ఉత్కంఠ..

స్థానిక సమరంపై కాంగ్రెస్‎లో కొత్త చర్చ మొదలయింది. బీసీల లెక్క తేలిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరపాలన్న డిమాండ్ ఊపు అందుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఎన్నికల షెడ్యూల్ తరుముకొస్తుండడం.. అప్పట్లోపు బీసీల కులగనన పూర్తవుతుందా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Telangana: పంచాయతీ పోరుపై కాంగ్రెస్‎లో కొత్త చిచ్చు.. ప్రభుత్వం నిర్ణయంపై ఉత్కంఠ..
Telangana
Follow us

| Edited By: Srikar T

Updated on: May 22, 2024 | 7:19 PM

స్థానిక సమరంపై కాంగ్రెస్‎లో కొత్త చర్చ మొదలయింది. బీసీల లెక్క తేలిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరపాలన్న డిమాండ్ ఊపు అందుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఎన్నికల షెడ్యూల్ తరుముకొస్తుండడం.. అప్పట్లోపు బీసీల కులగనన పూర్తవుతుందా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే సర్పంచ్‎ల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల కనుసన్నలలో గ్రామ పంచాయతీల పాలన సాగుతుంది. అయితే ఎక్కువ కాలం ప్రత్యేక అధికారుల పాలనలో ఉంచకుండా సకాలంలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. కానీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సవాల్‎గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా కుల గణన చేసేందుకు అసెంబ్లీ తీర్మానం చేసింది. కానీ లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ కుల గణన ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో బీసీల జనాభా లెక్క తేలేందుకు మరింత సమయం పట్టి అవకాశాలు ఉన్నాయి.

అప్పటిలోపు పంచాయతీ ఎన్నికలను ఆపే పరిస్థితి ఉండదు. బిఆర్ఎస్ హయాంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండేవి. అయితే రిజర్వేషన్లు 50 శాతానికి మించ కూడదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి కుదిస్తూ కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. దీన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయిస్తే.. వచ్చే పంచాయతీ ఎన్నికల్లోపు బీసీ రిజర్వేషన్ల లెక్క తేల్చాలని సూచించింది. దానికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అదే సమయంలో బిసి కుల గణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు కాంగ్రెస్లోని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని అందుకే పాత పద్ధతుల్లోనే రిజర్వేషన్లు అమలు చేస్తే పంచాయతీ ఎన్నికల్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతోందని చెబుతున్నారు. అందుకే ఐదేళ్లకు ఒకసారి వచ్చే పంచాయతీ ఎన్నికలను కొంతకాలం వాయిదా వేసి.. బీసీ జనాభా లెక్కలు తేలిన తర్వాత జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు పంచాయతీలో బీసీలకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.

అయితే పంచాయతీ ఎన్నికలను ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పంచాయతీ ఎన్నికలను విధిగా నిర్వహించాలి సాంకేతిక లేక రాజకీయపరమైన కారణాలతో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తే కేంద్ర నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు నిలిచిపోతాయి. అప్పుడు పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతుంది. దీనివల్ల ప్రభుత్వం అపకీర్తిని మూటకట్టుకోవాల్సి వస్తోంది. అయితే సకాలంలో ఎన్నికలు నిర్వహిద్దామంటే ఈ బీసీల రిజర్వేషన్ అంశము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతుంది. బీసీల కులగనన త్వరగా తేల్చే అంశం కాదు. 52 శాతానికి మించి రాష్ట్రంలో బీసీ జనాభా ఉంది. దీంతో బీసీల లెక్క తెలడానికి ఎక్కువ సమయం బట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగని పంచాయతీ ఎన్నికలు నిర్వహిద్దామంటే బీసీలు అంగీకరించే పరిస్థితి లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ఒక బాధ.. నిర్వహించకపోతే మరొక బాధ అన్నట్లు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారింది. దీంతో పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ముందు నుయ్యి వెనక కొయ్యి అన్నట్లు మారింది. అయితే ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అధిగమిస్తోంది అన్నది ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వం మాదిరిగా బీసీల ఒత్తిళ్లకు తలొగ్గకుండా సకాలంలో కాంగ్రెస్ ఎన్నికల నిర్వహిస్తుందా లేక బీసీ కులగన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతుందా వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్