Corona Vaccination: తెలంగాణలో జోరందుకున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ.. టీకా కేంద్రాలు వెయ్యికి పెంపు..

Corona Vaccination: తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. సోమవారం నాడు 334 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టగా..

Corona Vaccination: తెలంగాణలో జోరందుకున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ.. టీకా కేంద్రాలు వెయ్యికి పెంపు..
Coronavirus Vaccination

Updated on: Jan 19, 2021 | 7:48 AM

Corona Vaccination: తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. సోమవారం నాడు 334 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టగా.. నేటి నుంచి 1,034 కేంద్రాల్లో టీకా కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. నిర్ణీత కేంద్రాలకు సంబంధించి ఒక్కో కేంద్రంలో వంద మంది చొప్పున టీకా వేస్తామని ప్రభుత్వ వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆ లెక్కన ఇవాళ దాదాపు లక్ష మందికి టీకా వేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, సిబ్బంది కొరత కారణంగా అంతమందికి టీకా వేయడం సాధ్యం కాదని అధికావర్గాలు భావిస్తున్నాయి.

సరాసరిగా 50వేల మందికిపైగా టీకా వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఈ వ్యాక్సినేషన్‌ కోసం ఇప్పటికే జిల్లాలకు 1.70 లక్షల డోసుల పంపిణీ చేసినట్లు రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. కాగా, ఈనెల 21, 22వ తేదీల్లో రాష్ట్రానికి మరో 3.5 లక్షల కోవిడ్ టీకాలు వస్తాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ టీకాలను ప్రభుత్వ వైద్య సిబ్బందితో పాటు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేసే వైద్య సిబ్బందికి కూడా ఇస్తామని తెలిపారు. ఇదిలాఉంటే.. సోమవారం నాడు 334 కేంద్రాల్లో 13,666 మందికి టీకా ఇచ్చినట్లు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us