మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లా లో పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

|

Feb 08, 2021 | 5:48 AM

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లా లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఉదయం 10:30 గంటలకు గంభీరావుపేట హెడ్ క్వార్టర్ లో..

మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లా లో పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
Follow us on

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లా లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఉదయం 10:30 గంటలకు గంభీరావుపేట హెడ్ క్వార్టర్ లో మండల రైతువేదిక, ప్రభుత్వ పాఠశాల, డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారు. అనంతరం ఆయన విద్యార్థులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12:30 గంటలకు నర్మాలలో రైతు వేదిక ప్రారంభోత్సవం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. తదనంతరం పబ్లిక్ మీటింగ్ లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కొత్తపల్లి లో మహిళ సంఘ భవనం, శ్మశానవాటిక, పాఠశాలలో అదనపు తరగతి గదులకు ప్రారంభోత్సవం చేస్తారు కేటీఆర్. మధ్యాహ్నం 2 గంటలకు లింగన్నపేటలో రైతువేదిక ప్రారంభోత్సవం, మధ్యాహ్నం 2:30 గంటలకు మల్లారెడ్డిపేటలో రైతువేదిక ప్రారంభోత్సవం, మధ్యాహ్నం 3:00 గంటలకు సముద్రలింగాపూర్లో రైతువేదిక, పల్లె ప్రకృతివనం, శ్మశానవాటిక, గొర్రెల షెడ్లు ప్రారంభిస్తారు మంత్రి కేటీఆర్.

ఫస్ట్ జర్నీ ఫ్యామిలీ కోసం అంకితం, అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ప్రయాణం ప్రపంచంలోనే ప్రత్యేకం