Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపుల కేసులో పురోగతి.. కువైట్‌కు చెందిన మహమ్మద్ ఖాసీంగా గుర్తింపు

| Edited By: Balaraju Goud

Jan 20, 2024 | 7:54 PM

గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత టి. రాజా సింగ్‌కు బెదిరింపు కాల్స్ చేస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనను ఫోన్‌లో బెదిరిస్తున్నారని, హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నారని రాజా సింగ్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి కాల్స్ వస్తున్నాయని చెప్పారు. దీనిపై రాజాసింగ్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.

Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపుల కేసులో పురోగతి..  కువైట్‌కు చెందిన మహమ్మద్ ఖాసీంగా గుర్తింపు
Goshamahal Mla Raja Singh
Follow us on

గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత టి. రాజా సింగ్‌కు బెదిరింపు కాల్స్ చేస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనను ఫోన్‌లో బెదిరిస్తున్నారని, హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నారని రాజా సింగ్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి కాల్స్ వస్తున్నాయని చెప్పారు. దీనిపై రాజాసింగ్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.

VoIP నంబర్‌లను ఉపయోగించి కాల్ లోకేషన్స్ అధారంగా దర్యాప్తు చేపట్టారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. దీంతో కువైట్ నుండి కాల్స్ చేసినట్లు గుర్తించారు. 14 ఏళ్లుగా కువైట్ లో ఉంటున్న మహమ్మద్ ఖాసీమ్.. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రాజాసింగ్‌ను బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బెదిరిస్తున్న వ్యక్తి ప్రస్తుతం కువైట్‌లో ఉంటున్నట్లు తేలింది. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్టకు చెందిన ఖాసీమ్‌గా గుర్తించారు. అంతకు ముందు అతను సౌదీ అరేబియాలో ఉన్నట్లు వివరాలు కనుగొన్నారు. నిర్ధారణ తర్వాత, పోలీసులు ఖాసిం పాస్‌పోర్ట్ వివరాలను సేకరించారు. దీంతో మమ్మద్ ఖాసిం కోసం సైబర్ క్రైమ్ పోలీసులు ఎల్ఓసి నీ జారీచేశారు. అతని పేరుపై అన్ని విమానాశ్రయాలు, సముద్ర ఓడరేవులు, సరిహద్దు చెక్‌పోస్టులకు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…