తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మంత్రుల భేటీ

|

Sep 15, 2020 | 8:20 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మంగళవారం సమావేశమయ్యారు. అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొన్నారు..

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మంత్రుల భేటీ
Follow us on

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మంగళవారం సమావేశమయ్యారు. అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొన్నారు. కొత్తగా తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం వల్ల గిరిజనుల, దళితులు మరింత లబ్ది పొందేందుకు ఈ సమావేశంలో చర్చించారు. ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న పథకాలు సమర్థవంతంగా చేరేందుకు, పోడు భూముల, అసైన్డ్ భూముల సమస్య తీర్చే విధంగా సభ్యులు మేథోమథనం చేశారు. ఆర్. ఓ.ఎఫ్.ఆర్ పట్టాలలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా సమాలోచనలు చేశారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఎస్సీ ఎస్ డి ఎఫ్, ఎస్టి ఎస్ డి ఎఫ్ ఇంకా ఏ విధంగా అమలు చేస్తే ఎస్సీలు, ఎస్టీ లకు మరింత లబ్ధి జరుగుతుందన్న దానిపై గౌరవ సభ్యులు సలహాలు సూచనలు ఇచ్చారు.