KTR: రూపీ పతనం.. నిర్మలమ్మపై కేటీఆర్ సెటైర్లు.. రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటోలు వెతుకుతున్నారంటూ..
Nirmala Sitharaman vs KTR: ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. సందర్భానికి అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం విధి విధానాలను తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.
Nirmala Sitharaman vs KTR: ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. సందర్భానికి అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం విధి విధానాలను తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. తాజాగా రూపాయి విలువ భారీగా పతనమవ్వడంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆమె ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీని కవర్ చేసే పనిలో ఆర్థికమంత్రి బిజీగా ఉన్నారంటూ ట్వీట్ చేశారు. ‘రూపాయి ఆల్టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. కానీ మేడమ్ FM (ఆర్థిక మంత్రి) PDS షాపుల్లో PM ఫొటోల కోసం వెతుకుతూ బిజీగా ఉన్నారు. రూపాయి దాని సహజ స్థితికి చేరుకుంటుందని ఆమె మీకు చెబుతుంది. అన్ని ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం యాక్ట్స్ ఆఫ్ గాఢ్లో భాగమే. విశ్వ గురువు గారికి నమస్కారం’ అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు కేటీఆర్.
కాగా.. ఫారెక్స్ మార్కెట్లో గురువారం భారత కరెన్సీ భారీగా పతనమైంది. నిన్న ఒక్క రోజులోనే 83 పైసలు దిగజారి 80.79 వద్ద క్లోజైంది. రూపీ చారిత్రక కనిష్ఠ స్థాయి ఇదే కావడం గమనార్హం. అంతేకాదు.. ఫిబ్రవరి 24వ తేదీన 99 పైసలు నష్టపోయిన తర్వాత రెండో పెద్ద నష్టం ఇది. గురువారం డాలర్ మారకంలో రూపాయి 80.27 వద్ద ప్రారంభమై కనిష్ఠ స్థాయి 80.95ని తాకింది. చివరికి 83 పైసల నష్టంతో 80.79 వద్ద ముగిసింది. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి 6.5 శాతం మేర క్షీణించింది.
While Rupee is at an all time low
Madam FM is busy looking for PM’s photos in PDS shops
She will tell you that the Rupee will find its natural course. All economic hardships, unemployment & inflation are due to Acts of God
Hail Vishwa Guru ? https://t.co/cB6as4bnpv
— KTR (@KTRTRS) September 23, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..