
రైతుల ప్రాణాలు తీసే ప్రాణాంతక రసాయనాలు ఉన్నాయన్న కారణంతో రాష్ట్రంలో పారాక్వైట్ గడ్డిమందు అమ్మకాన్ని నిషేదిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో పారాక్వాట్ అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజులు నిషేధం విస్తున్నట్టు తాజాగా పేర్కొంది. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాంమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇదే విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. దీనిపై శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నిషేధ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ గడ్డి మందు వినియోగంతో రైతులు, కూలీలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని. అలానే ఇంట్లొ గొడవల సందర్భంగా కొన్ని సార్లు క్షణికావేశంలో ఎంతో మంది రైతులు ఈ మందు తాగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రసాయనం వల్ల కలిగే అనర్థాలను అరికట్టాలనే ఉద్దేశంతోనే దీని వాడకంపై నిషేదం విదించామని తెలిపారు.
ఈ తీర్మాణం సదర్భంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 70 దేశాల్లో ఈ మందును నిషేధించారని, ఈ మందును తయారు చేసే స్విట్జర్లాండ్ లో కూడా దీన్ని వినియోగిచట్లేదన్నారు. ప్రతి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2వేల మంది రైతులు ఈ మందుతాగి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.