Telangana: ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన.. మహిళే ఇంటి యజమానిగా..

|

Sep 28, 2024 | 9:47 PM

కుటుంబ డిజిట‌ల్ కార్డులో మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తించాల‌ని, ఇత‌ర కుటుంబ స‌భ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌కు సంబంధించి రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి శ‌నివారం స‌మీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఫ్యామిలీ డిజిట‌ల్..

Telangana: ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన.. మహిళే ఇంటి యజమానిగా..
Follow us on

కుటుంబ డిజిట‌ల్ కార్డులో మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తించాల‌ని, ఇత‌ర కుటుంబ స‌భ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌కు సంబంధించి రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి శ‌నివారం స‌మీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌పై ఈ నెల 25వ తేదీ నుంచి 27 వ తేదీ వ‌ర‌కు రాజ‌స్థాన్‌, హ‌ర్యానా, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రల్లో ప‌ర్యటించిన అధికారులు చేసిన అధ్యయ‌నంపై ప‌వ‌ర్ పాయింట్ ప్రజంటేష‌న్ ఇచ్చారు. కార్డుల రూపకల్పలో ఆయా రాష్ట్రాలు సేక‌రించిన వివ‌రాలు, కార్డుల‌తో క‌లిగే ప్రయోజ‌నాలు, లోపాల‌ను అధికారులు వివ‌రించారు.

ప్రస్తుతం ఉన్న రేష‌న్, రాజీవ్ ఆరోగ్యశ్రీ‌, ఐటీ, వ్యవ‌సాయ‌, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల్లోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధార‌ణ చేయాల‌ని సీఎం అధికారులకు సూచించారు. ఇత‌ర రాష్ట్రాల కార్డుల రూప‌క‌ల్పన‌, జారీలో ఉన్న మేలైన అంశాల‌ను స్వీక‌రించాల‌ని, లోపాల‌ను పక్కనపెట్టాల‌న్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అన‌వ‌స‌ర స‌మాచారం సేక‌రించాల్సిన ప‌ని లేద‌న్నారు.

ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌కు స‌మ‌చార సేక‌ర‌ణ‌, వాటిల్లో ఏం ఏం పొందుప‌ర్చాలి. అప్‌డేట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌ల‌తో కూడిన మంత్రివ‌ర్గ ఉప సంఘానికి అంద‌జేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రివ‌ర్గ ఉప సంఘం సూచ‌న‌ల మేర‌కు అందులో జ‌త చేయాల్సిన‌, తొల‌గించాల్సిన అంశాల‌ను స‌మ‌గ్ర జాబితా రూపొందించాల‌ని సూచించారు. అనంత‌రం రాష్ట్రంలోని 119 శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు ప్రాంతాలు ఒక గ్రామీణ‌, ఒక ప‌ట్టణ ప్రాంతాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాల‌ని సీఎం సూచించారు.

కుటుంబాల నిర్ధార‌ణ‌, ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల వివ‌రాల‌కు సంబంధించి అందుబాటులో ఉన్న డాటా ఆధారంగా అక్టోబ‌రు మూడో తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలోడోర్ టూ డోర్‌ ప‌రిశీల‌న చేయించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. పైలెట్ ప్రాజెక్టును ప‌క‌డ్బందీగా చేపట్టాల‌ని, ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నియోజ‌క‌వ‌ర్గానికి ఆర్డీవో స్థాయి అధికారిని, ప‌ట్టణ‌ న‌గ‌ర ప్రాంతాల్లో జోన‌ల్ క‌మిష‌న‌ర్ స్థాయి అధికారిని ప‌ర్యవేక్షణ‌కు నియ‌మించాల‌ని, ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇటీవ‌ల వ‌ర‌ద‌ల స‌మ‌యంలో వేసిన సీనియ‌ర్ అధికారుల‌ను ప‌ర్యవేక్షకులుగా నియ‌మించాల‌ని ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శిని సీఎం ఆదేశించారు. క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న స‌మ‌గ్రంగా క‌చ్చిత‌త్వంతో చేప‌ట్టాల‌ని, ఎటువంటి లోపాల‌కు తావులేకుండా చూడాల‌ని సీఎం హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి