Telangana: మరోసారి వాయింపు.. టికెట్‌ ఛార్జీలు పెంచిన TSRTC.. నేటి నుంచే అమల్లోకి

తెలంగాణ ఆర్టీసీ మరోసారి ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. డీజిల్ సెస్ పేరుతో టికెట్ ఛార్జీలు పెంచింది. పెంచిన ఛార్జీలు శనివారం నుంచే అమల్లోకి రానున్నాయి.

Telangana: మరోసారి వాయింపు.. టికెట్‌ ఛార్జీలు పెంచిన TSRTC.. నేటి నుంచే అమల్లోకి
Tsrtc

Updated on: Apr 09, 2022 | 9:15 AM

తెలంగాణ ఆర్టీసీ బాదుడు ఆపడం లేదు. ప్రయాణీకుల నడ్డి విరుస్తుంది.  మరోసారి ఛార్జీలు పెంచింది. ఇప్పటికే రౌండ్ అప్ అంటూ ఒకసారి వాయించారు. టోల్ ప్లాజాల ఛార్జీలు పెరిగాయని టోల్ గేట్ల వద్ద ఛార్జీలు పెంచారు. ప్యాసింజర్ సెస్(passenger cess) కూడా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. తాజాగా డీజిల్ సెస్( diesel cess) వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో పాసింజర్ నుంచి డీజిల్ సెస్ కింద రూ.2 లు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసుల్లో ఒక్కో పాసింజర్ నుంచి రూ.5లు వసూలు చేస్తున్నారు. పెంచిన ఛార్జీలు శనివారం(9 ఏప్రిల్) నుంచి అమల్లోకి వచ్చాయి. రోజు రోజుకు డీజిల్ ధరలు పెరుగుతున్నాయని.. సంస్థపై భారం పడకుండా డీజిల్ సెస్ అమలు చేయాల్సి వస్తుందని యాజమాన్యం చెబుతుంది. ప్రజలు ఈ విషయం అర్థం చేసుకుని.. సహకరించాలని టీఎస్​ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్(Bajireddy Govardhan), ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

 ఆర్టీసీలో ప్రతి రోజు 6 లక్షల లీలర్ల డీజిల్​ను వినియోగిస్తున్నారు. ఇటీవల కాలంలో చమురు ధరలు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. 2021 డిసెంబరులో రూ.85 ఉన్న డీజిల్​ ధర… ప్రస్తుతం రూ.118 కి చేరింది,   దీంతో డీజిల్ సెస్ అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే డీజిల్ సెస్ విధించాల్సి వచ్చిందని TSRTC తెలిపింది.

Also Read: Viral: కోటి ఆశలతో కొత్త జీవితంలోకి.. తొలి రాత్రి వధువు చెప్పిన నిజంతో అంతా కొలాప్స్

Loading...
Unable to load recommendations.
Follow Us