Telangana: అర్థరాత్రి హాస్టల్‌ నుంచి గట్టి గట్టిగా కేకలు.. ఏమైందని వెళ్లి చూడగా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషాదం వెలుగు చూసింది.బూర్గంపాడు మండలం సారపాక లోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల హాస్టల్‌లో రాత్రి నిద్రిస్తున్న 8 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. దీంతో అప్రమత్తమైన హాస్టల్స్ సిబ్బంది వెంటనే వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు.

Telangana: అర్థరాత్రి హాస్టల్‌ నుంచి గట్టి గట్టిగా కేకలు.. ఏమైందని వెళ్లి చూడగా..
Bhadradri Kothagudem Rat Bite

Edited By:

Updated on: Sep 13, 2026 | 9:54 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. బూర్గంపాడు మండలం సారపాకలోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కరవడం వల్ల 8 మంది విద్యార్థినిలును గాయాలపాలయ్యారు, వెంటనే సిబ్బందించిన హాస్టల్ సిబ్బంది. వారిని భద్రాచలం ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు.

గత కొంతకాలంగా హాస్టల్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని, ఇదే విషయంపై ప్రిన్సిపాల్ కు కూడా ఫిర్యాదు చేశామని విద్యార్థినిలు చెప్తున్నారు. కాలేజీ హాస్టల్లో ఎనిమిది మంది బాలికలు ఎలుకల బారిన పడి గాయపడిన విషయాన్ని బయటకు రాకుండా ప్రిన్సిపల్ ఎన్ని ప్రయత్నాలు చేసినటప్పటికీ.. అది చివరకు అధికారుల దృష్టికి చేరడంతో.. తాజాగా కాలేజీని సందర్శించిన విజిలెన్స్ అధికారులు.. జరిగిన ఘటనపై విద్యార్థినుల నుంచి వివరాలు సేకరించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే తమకు ఎందుకు సమాచారము ఇవ్వలేదంటూ ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటన విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ.. ఎలుకలు కొరకడంతో ఎనిమిది మంది బాలికలకు స్వల్ప గాయాలయ్యాయని, హాస్టల్లో ఎలుకల నివారణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. త్వరలోనే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం చూపిస్తామని తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us