ఖమ్మం జిల్లా: గుండెపోటుతో 31 ఏళ్ల యువకుడు మృతి.. జిమ్‌కి వెళ్లి వచ్చిన కాసేపటికే విషాదం..!

|

Jul 10, 2023 | 11:14 AM

జిమ్‌లో వ్యాయామం చేసి వచ్చిన కాసేపటికే 31 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఖమ్మం జిల్లా: గుండెపోటుతో 31 ఏళ్ల యువకుడు మృతి.. జిమ్‌కి వెళ్లి వచ్చిన కాసేపటికే విషాదం..!
Heart Attack
Follow us on

ఖమ్మం: జిమ్‌లో వ్యాయామం చేసి వచ్చిన కాసేపటికే 31 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఖమ్మం జిల్లా బాలపేటకు చెందిన మానుకొండ రాధాకిశోర్ గతంలో కాంగ్రెస్‌ నాయకుడిగా పనిచేశాడు. ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్‌గా పని చేస్తున్నాడు. ఆయన రెండో కుమారుడు శ్రీధర్‌ (31) సోమవారం ఉదయం జిమ్‌కి వెళ్లాడు. జిమ్‌లో వ్యాయామం చేసి ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే శ్రీధర్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. శ్రీధర్‌ మృతి చెందిన విషయం తెలిసుకున్న ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా నిన్న ఆదివారం ఉదయం ఖమ్మంలోని అల్లీపురంకి చెందిన గరికపాటి నాగరాజు(33) ఇదే విధంగా హఠాత్తుగా గుండె పోటుతో మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు యువకులు గుండెపోటుతో మరణించడంతో సర్వత్రా చర్చణీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.