Chief Justice: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ పర్యటన.. రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

Chief Justice: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ శని, ఆదివారాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. శనివారం ములుగు జిల్లాలోని రామప్ప..

Chief Justice: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ పర్యటన.. రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

Edited By:

Updated on: Dec 18, 2021 | 8:36 PM

Chief Justice: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ శని, ఆదివారాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. శనివారం ములుగు జిల్లాలోని రామప్ప ఆలయంలో ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన రాకకు ఆలయ మార్యదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అర్చకులు. ప్రత్యేక పూజల అనంతరం జిస్టిస్‌ ఎన్‌వీ రమణకు తీర్థ ప్రసాధాలు అందజేశారు. అయతే రాత్రి రాష్ట్రప్రభుత్వం ఇచ్చే విందుకు రమణ హాజరువుతారు. రాత్రికి హనుమకొండలోని ఎన్‌ఐటీ అతిథిగృహంలో బస చేయనున్నారు.

అలాగే ఆదివారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం హనుమకొండలోని కోర్టుల సముదాయన్ని ప్రారంభిస్తారు. ఆదివారం సాయంత్రం షామీర్‌పేటలోని నల్సార్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. తర్వాత ఆ రాత్రి హైదరాబాద్‌లో బస చేసి సోమవారం ఢిల్లీకి వెళ్తారు.

ఇవి కూడా చదవండి:

ప్రయాణికుడు ముఖానికి మాస్క్‌కు బదులు ఏం ధరించాడో చూడండి.. అతనిపై కోపంతో రగిలిపోయి విమానం దింపేసిన అధికారులు

Delhi Schools: పాఠశాలలపై ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం