Sonu Sood: కేబీసీ సెట్‌లో సోనూసూద్… అమితాబ్‌ను కలిసిన కలియుగ కర్ణుడు… ఎందుకో తెలుసా..?

| Edited By:

Jan 02, 2021 | 1:39 AM

కలియుగ కర్ణుడు సోనూసూద్ హిందీ కేబీసీ(మీలో ఎవరు కోటీశ్వరుడు ) సెట్‌లో ప్రత్యక్షమయ్యారు. బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కలిశాడు.

Sonu Sood: కేబీసీ సెట్‌లో సోనూసూద్... అమితాబ్‌ను కలిసిన కలియుగ కర్ణుడు... ఎందుకో తెలుసా..?
Follow us on

కలియుగ కర్ణుడు సోనూసూద్ మీలో ఎవరు కోటీశ్వరుడు హిందీ కేబీసీ సెట్‌లో ప్రత్యక్షమయ్యారు. బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కలిశాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను సోనూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఇంతకీ సోనూ బిగ్ బీని ఎందుకు కలిశారంటే… తన ఆత్మకథ పుస్తకం ఐ యామ్ నో మేసయ్య పుస్తకాన్ని అమితాబ్‌కు అందించాడు. కాగా, పెంగ్విన్ ర్యాండ్ హౌజ్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కూడా సోనూసూద్ ఇప్పటికే ఈ పుస్తకాన్ని ఆచార్య సెట్‌లో అందించారు. ప్రస్తుతం సోనూసూద్ తెలుగులో ఆచార్య, అల్లుడు అదుర్స్, హిందీలో పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.

 

Aso Read:   F3 Movie : నూతన సంవత్సరానికి కరెన్సీ నోట్లతో వెల్కమ్ చెప్పిన వెంకటేష్, వరుణ్ తేజ్