Telangana Student: ఫిలిప్పీన్స్‌లో అసలేం జరిగిందో ఏంటో.. పుట్టిన రోజు నాడే.. మరణం..

పుట్టిన రోజు నాడే దారుణం చోటుచేసుకుంది.. ఆమె ఒక వైద్య విద్యార్థిని.. విదేశాల్లో చదువుకుంటోంది.. ఆమె పుట్టిన రోజును ఆనందంగా జరుపుకుంటుంది.. అని కుటుంబసభ్యులు భావించారు.. కానీ.. అలా జరగలేదు.. ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది.

Telangana Student: ఫిలిప్పీన్స్‌లో అసలేం జరిగిందో ఏంటో.. పుట్టిన రోజు నాడే.. మరణం..
Crime News

Edited By:

Updated on: Nov 16, 2024 | 10:22 AM

పుట్టిన రోజు నాడే దారుణం చోటుచేసుకుంది.. ఆమె ఒక వైద్య విద్యార్థిని.. విదేశాల్లో చదువుకుంటోంది.. ఆమె పుట్టిన రోజును ఆనందంగా జరుపుకుంటుంది.. అని కుటుంబసభ్యులు భావించారు.. కానీ.. అలా జరగలేదు.. ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన చింత స్నిగ్ధ అనే విద్యార్థిని ఫిలిప్పీన్స్ దేశంలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన స్నిగ్ధ పుట్టిన రోజే ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల సమయంలో చనిపోవడం కలకలం రేపింది..

ఫిలిప్పీన్స్‌ దేశంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న స్నిగ్ధ పుట్టిన రోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో స్నేహితులు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లారు. ఇంతలోనే ఆమె గదిలో శవమై కనిపించారు. అది చూసిన స్నేహితులంతా ఒక్కసారిగా ఏం జరిగింది అనే భయాందోళనలోకి వెళ్లిపోయారు. అనంతరం స్నిగ్ధ తల్లిదండ్రులకు ఈ ఘటన గురించి తెలియజేశారు.

సమాచారం అందుకున్న పటాన్‌చెరులోని ఆమె కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె తండ్రి అమృత్‌రావు తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్‌ శాఖలో డీఈగా (డివిజినల్​ ఇంజినీర్​)గా విధులు నిర్వర్తిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఫిలిప్పీన్స్‌ దేశ అధికారులతో సంప్రదింపులు జరపాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కాగా.. విదేశాలలో తెలుగు విద్యార్థుల మృతి కేసులు పెరుగుతుండటం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.. కొందు యాక్సిడెంట్లలో..మరణిస్తుండగా.. కొందరి మృతికి కారణం తెలియకుండానే కాలం మారిపోతుండటం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది.. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే విదేశాలు కావున.. కష్టంగా మారుతోంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us