జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రోటోకాల్ వివాదం అధికార పార్టీ నాయకుల మధ్య అగ్గి రాజేసింది. శిలాఫలకంపై తమ పేర్లు లేనందున ప్రారంభోత్సవం అనంతరం శిలఫలకాన్ని ధ్వంసం చేశారు కొందరు నేతలు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్లో విద్యుత్ వినియోగదారుల కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. అబ్రహం, గద్వాల జడ్పీ చైర్మన్ సరిత ప్రారంభించారు. అయితే అక్కడే ఉన్న స్థానిక జెడ్పిటీసీ, ఎంపీపీల పేర్లు అందులో లేనందున ఆగ్రహానికి లోనైన వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారు.
ప్రోటోకాల్ ప్రకారం తమ పేర్లు తీసుకొని శిలాఫలకంలో పెట్టిస్తామని అధికారులు చెప్పారని…తీరా చూస్తే అక్కడ తమ పేర్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులం కాబట్టే అధికారులు ఉద్దేశపూర్వకంగానే తమను దూరం పెడుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు జడ్పీటీసీ రాజు.
Also Read:
Daily essentials: సామాన్యులకు మరో షాక్.. పెరగనున్న వంట నూనె , సబ్బులు, బిస్కెట్ల ధరలు
Andhra Pradesh Ration: ఏపీలో ఇకపై ఓటీపీ చెబితేనే రేషన్.. ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త విధానం..