CM KCR: కుల, మతాల పేరుతో చేసే చిల్లర రాజకీయాలు.. క్యాన్సర్‌ కంటే ప్రమాదకరంః సీఎం కేసీఆర్

|

Apr 26, 2022 | 3:53 PM

పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించడమే ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు. హైదరాబాద్‌లో కొత్తపేట, ఎర్రగడ్డ, అల్వాల్‌లో టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు భూమిపూజ చేశారు సీఎం కేసీఆర్.

CM KCR: కుల, మతాల పేరుతో చేసే చిల్లర రాజకీయాలు.. క్యాన్సర్‌ కంటే ప్రమాదకరంః సీఎం కేసీఆర్
Cm Kcr
Follow us on

Hyderabad TIMS Hospitals: పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించడమే ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు. హైదరాబాద్‌లో కొత్తపేట, ఎర్రగడ్డ, అల్వాల్‌లో టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు భూమిపూజ చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సభలతో అన్ని పార్టీలు బీజీగా ఉంటే, మనం మాత్రం ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నామన్నారు సీఎం. రాష్ట్రంలో వైద్యవిధానాన్ని పటిష్ఠం చేస్తున్నాం. దీనిలో భాగంగానే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా 16 స్పెషాలిటీ, 15 సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సీఎం వెల్లడించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో వైద్య సేవల్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఒకేరోజు మూడు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌కు భూమిపూజ చేశారు. తొలుత కొత్తపేట పండ్ల మార్కెట్‌ స్థలంలో నిర్మిస్తోన్న టిమ్స్‌ హాస్పిటల్‌కు భూమిపూజ నిర్వహించారు. ఆ తర్వాత ఎర్రగడ్డ, చివరగా ఆల్వాల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు భూమిపూజ చేశారు సీఎం కేసీఆర్.

ఈ మూడు హాస్పిటల్స్‌ను వెయ్యి పడకల సామర్ధ్యంతో నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఒకే ఒక్క ఏడాదిలో కన్‌స్ట్రక్షన్‌ కంప్లీట్‌చేసి, వైద్యసేవల్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపడుతోందన్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌ తరహాలో ఈ మూడు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించనున్నారు. 2వేల 679 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మూడు హాస్పిటల్స్‌ను నిర్మిస్తున్నారు. సుమారు 14లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ ఆస్పత్రుల్లో పీజీ, సూపర్‌ స్పెషాలిటీ సీట్లు అందుబాటులో రానున్నాయి. అలాగే, వీటికి అనుబంధంగా నర్సింగ్‌ అండ్ పారా మెడికల్‌ కోర్సులు చేపట్టనున్నారు.

అన్ని మతాలు, కులాలను ఆదరించే దేశం మనదని.. కొందరు మాత్రం కులం, మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. అది క్యాన్సర్‌ జబ్బులాంటిదని.. ఒకసారి వస్తే చాలా ప్రమాదకరమని చెప్పారు. అన్ని కులాలు, మతాలను ఆదరించే పరిస్థితిని చెడగొడితే ఎటూ కాకుండా పోతామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పరిధిలో మూడు టిమ్స్‌ ఆస్పత్రులకు కేసీఆర్‌ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్వాల్‌లో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. అల్వాల్‌ టిమ్స్‌లో ప్రసూతి సేవల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కరోనాలాంటి వైరస్‌లు భవిష్యత్‌లోనూ వచ్చే ప్రమాదముందన్నారు సీఎం. హైదరాబాద్‌ నగరంపై ఒత్తిడి పెరుగుతున్నందున ఎయిమ్స్‌ తరహాలో టిమ్స్‌ ఆస్పత్రులను తీసుకొస్తున్నామన్నారు. కేవలం గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌పైనే ఆధారపడకుండా నగరానికి నలువైపులా వైద్య

కులమతాల పేరుతో రాజకీయాలు చేసే వారిని నమ్మొద్దని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మన దేశానికి చెందిన సుమారు 13కోట్ల మంది విదేశాల్లో పనిచేస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు వాళ్లని వెనక్కి పంపితే వారికి ఉద్యోగాలు ఎవరిస్తారని సీఎం ప్రశ్నించారు. ఈ ఏడేళ్లలో హైదరాబాద్‌లో 2.30లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని సీఎం గుర్తు చేశారు. 10 నుంచి 15లక్షల మందికి ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో 14వేల ఎకరాల్లో ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రపంచానికే వ్యాక్సిన్ల రాజధానిగా హైదరాబాద్‌ మారిపోయిందన్న కేసీఆర్.. జీనోమ్‌ వ్యాలీలో వ్యాక్సిన్‌ సంస్థలు ఉన్నాయన్నారు. విదేశీ పెట్టుబడుదారులు పరిశ్రమలు స్థాపించేందుకు హైదరాబాద్‌ వైపే చూస్తున్నారన్నారు. ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా? మతం, కులం పేరుతో కొట్లాటలు, కర్ఫ్యూలు ఉంటే పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారని కేసీఆర్ అన్నారు. అలాంటి క్యాన్సర్‌ మన దగ్గర తెచ్చుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ఆస్కారం ఇవ్వొద్దన్నారు ముఖ్యమంత్రి.

మనది పసికూన రాష్ట్రమైనా అద్భుతమైన ప్రగతి సాధిస్తోందన్నారు సీఎం కేసీఆర్. గుజరాత్‌, మహారాష్ట్ర తదితర పెద్ద రాష్ట్రాల కంటే మన తలసరి ఆదాయం ఎక్కువ. తెలంగాణ తరహా పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవు. ఇండియాలో కరెంట్ ఉంటే వార్త.. తెలంగాణలో కరెంట్‌ పోతే వార్త. గుజరాత్‌లో రైతులు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నాం. మిషన్‌ భగీరథతో మంచినీటి కొరత తీర్చుకున్నాం. సాగునీటి రంగంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం. వైద్యం, విద్యపై రాబోయే రోజుల్లో దృష్టి పెట్టబోతున్నాం. ప్రజల మద్దతుతోనే ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజల దీవెన ఇదేవిధంగా కొనసాగాలి.. తెలంగాణ మరింత పచ్చబడాలి. దుష్టశక్తుల బారి నుంచి ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని ముందుకెళ్తామని కేసీఆర్‌ అన్నారు.