సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని.. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో RI ఆత్మహత్య! ఏం జరిగిందో

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సతీశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని.. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో RI ఆత్మహత్య! ఏం జరిగిందో
Nizamabad RI Death

Updated on: Sep 18, 2026 | 1:44 PM

నిజామాబాద్‌, సెప్టెంబర్ 18: నిజామాబాద్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్ఐ)గా విధులు నిర్వహిస్తున్న సతీశ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. విధుల్లో భాగంగా ఉన్న సమయంలో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో నిజామాబాద్‌ పోలీస్‌ శాఖలో విషాదం నెలకొంది. ఆర్ఐ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీ సాయి చైతన్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్ఐ సతీశ్‌ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు, ఆర్ఐ వ్యక్తిగత పరిస్థితులు, ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us