Telangana: మందేస్తూ.. చికెన్ తింటూ మృతి.. డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ చూసి షాక్

|

Jan 10, 2024 | 7:19 PM

ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర కుమార్ వర్మ, ధర్మేందర్ తివారి గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఏలికట్ట గ్రామంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఇద్దరు పార్టీ చేసుకోవాలనుకున్నారు. అందుకోసం.. చికెన్ తెచ్చి మాంచి స్పైసీగా వండుకున్నారు. తమకు ఇష్టమైన పూరీలు చేసుకున్నారు.

Telangana: మందేస్తూ.. చికెన్ తింటూ మృతి.. డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ చూసి షాక్
Liquor Chicken (Representative image)
Follow us on

పుట్టుక ఎప్పుడు, చావు ఎప్పుడు అనేది ప్రకృతి ఆధీనం. ఏ రూపంలో అయినా, ఎప్పుడైనా చావు ముంచుకురావొచ్చు. తాజాగా ఓ వ్యక్తి మందు తాగుతూ, చికెన్ తింటూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తే.. అతడి చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అయితే వైద్యులు చెప్పిన కారణంతో కుటుంబ సభ్యుల షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళ్తే… ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర కుమార్ వర్మ, ధర్మేందర్ తివారి గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఏలికట్ట గ్రామంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఇద్దరు పార్టీ చేసుకోవాలనుకున్నారు. అందుకోసం.. చికెన్ తెచ్చి మాంచి స్పైసీగా వండుకున్నారు. తమకు ఇష్టమైన పూరీలు చేసుకున్నారు. ముక్క ఉంటే మందు కూడా ఉండాలి అనుకున్నారు ఏమో.. మద్యం కూడా అప్పటికే తెచ్చిపెట్టుకున్నారు. కుకింగ్ పూర్తయిన తర్వాత.. చికెన్‌ను స్టఫ్‌గా తింటూ మద్యం తాగుతున్నారు. ఇంతలోనే విషాదం జరిగింది

మద్యం తాగుతూ చికెన్ తింటుండగా.. జితేంద్రకుమార్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఎంత లేపినా ఉలుకూ, పలుకూ లేదు. ముఖంపై నీళ్లు కొట్టినా సోయిలోకి రాలేదు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించగా.. గొంతులో చికెన్ ముక్క ఇరుకొని మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ధర్మేందర్ తివారి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.