Janasena Telangana : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో జనసేన జెండా.. ఆయా డివిజన్ల అభ్యర్థులు వీళ్లే..

|

Apr 21, 2021 | 7:20 PM

Janasena candidates for Khammam : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో జనసేన జెండా రెపరెపలాడబోతోంది.

Janasena Telangana : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో జనసేన జెండా..  ఆయా డివిజన్ల అభ్యర్థులు వీళ్లే..
Bjp Janasena
Follow us on

Janasena candidates for Khammam : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో జనసేన జెండా రెపరెపలాడబోతోంది. 6 డివిజన్లలో జనసేన పోటీ చేయబోతోంది. ఆయా డివిజన్లలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. జనసేన – బీజేపీ పొత్తులో భాగంగా జనసైనికులు 6 స్థానాల్లో.. మిగిలిన చోట్ల బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారు. 23, 48, 28, 16, 8, 51 డివిజన్లను జనసేనకు కేటాయించింది తెలంగాణ బీజేపీ. మొత్తంగా ఖమ్మం నగరంలోని 60 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తెకు మద్ధతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తర్వాత ఇరుపార్టీలు సయోధ్యకు వచ్చి పరస్పర సమన్వయంతో గెలుపునకు కృషి చేయాలని జనసేన-బీజేపీ నేతలు నిర్ణయించారు. అటు, ఏపీలో జనసేన-బీజేపీ మిత్రపక్షాలుగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలువబోతోన్న జనసేన అభ్యర్థులు వీరే.. :

8వ డివిజన్ – బోడా వినోద్

16వ డివిజన్ – బండారు రామకృష్ణ

23వ డివిజన్ – మిరియాల జగన్

28వ డివిజన్ – భోగా హరిప్రియ

48వ డివిజన్ – ధనిశెట్టి భానుమతి

51వ డివిజన్ – సింగారపు చంద్రమౌళి

Read also :