
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. దాదాపు అన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నాయి.. దీంతో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి ద్రోణి/గాలి అంతరాయం ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ, నైరుతి దిశగ గాలులు వీస్తున్నాయి.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి:-
శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణము ఏర్పడే అవకాశముంది.
శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణము ఏర్పడే అవకాశముంది.
శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణము ఏర్పడే అవకాశముంది.
గమనిక :- కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాం రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు. రాయలసీమలో రాగల 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 – 44 డిగ్రీలు సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశముంది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్న విదర్భ నుండి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు ఉత్తరా అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ అంతర్గత కర్నాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో శనివారం, ఆదివారం, సోమవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.
ఈరోజు,రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 30- 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..