3,726 శ్యాంపిల్స్లో 2,672 మందికి పాజిటివ్ రిపోర్టులు.. ల్యాబ్ మూసివేత
హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ల్యాబ్ రిపోర్టులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆ ల్యాబ్లో 3,726 శ్యాంపిల్స్లో 2,672 మందికి పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు ఇచ్చింది.
హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ల్యాబ్ రిపోర్టులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆ ల్యాబ్లో 3,726 శ్యాంపిల్స్లో 2,672 మందికి పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు ఇచ్చింది. మొత్తం 71.7 శాతం పాజిటివ్ రిపోర్టును ఇచ్చింది ఈ ల్యాబ్. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం వెంటనే ల్యాబ్ని పరిశీలించాలని ఎక్స్పర్ట్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువ పాజిటివ్ కేసులు రిపోర్ట్ చేసిన ల్యాబ్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కాగా తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20462 చేరింది. శుక్రవారం తెలంగాణలో రికార్డు స్థాయిలో(1,892) కరోనా కేసులు నమోదయ్యాయి. 283 మంది కరోనాతో మరణించగా.. 9,984 యాక్టివ్ కేసులు ఉన్నాయి.