Hyderabad MMTS: హైదరాబాదీలకు అలర్ట్‌.. రేపటి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

|

May 24, 2024 | 6:42 PM

హైదరాబాద్‌, సికింద్రాబాద్ నగరవాసులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ఆదేశాలు జారీ చేసింది. జంట నగర వాసులు ఎక్కువగా ఉపయోగించే ఎంఎంటీఎస్‌ రైళ్ల విషయంలో కీలక ప్రకటన చేసింది. మే 25, 26వ తేదీల్లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు, నాలుగు డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Hyderabad MMTS: హైదరాబాదీలకు అలర్ట్‌.. రేపటి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
Mmts Trains
Follow us on

హైదరాబాద్‌, సికింద్రాబాద్ నగరవాసులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ఆదేశాలు జారీ చేసింది. జంట నగర వాసులు ఎక్కువగా ఉపయోగించే ఎంఎంటీఎస్‌ రైళ్ల విషయంలో కీలక ప్రకటన చేసింది. మే 25, 26వ తేదీల్లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు, నాలుగు డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ప్రస్తుతం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు జరుగుతోన్న విషయం తెలిసిందే. దీంతో పాటు. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణంల నేపథ్యంలో పలు మార్గాల్లో 22 ఎంఎంటీఎస్‌ సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు చీఫ్‌ పీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ప్రకటించారు. అలాగే సిద్దిపేట-సికింద్రాబాద్‌ మధ్య సర్వీసులందించే నాలుగు డెమూ రైళ్ల రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏయే రైళ్లను రద్దు చేశారు, పూర్తి వివరాలు..

మే 25, 26వ తేదీల్లో ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ మేడ్చల్‌, మేడ్చల్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా మధ్య ప్రయాణించే రైళ్లను రద్దు చేశారు. అలాగే మే25వ తేదీన మేడ్చల్‌-లింగంపల్లి, లింగంపల్లి-మేడ్చల్‌, మేడ్చల్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్-మేడ్చల్‌, మేడ్చల్‌-సికింద్రాబాద్‌ రైళ్లను రద్దు చేశారు.

మేడ్చల్‌-హైదరాబాద్‌, హైదరాబాద్‌-మేడ్చల్‌, మేడ్చల్‌-లింగంపల్లి, లింగంపల్లి-మేడ్చల్‌, సికింద్రాబాద్‌ మేడ్చల్‌ మధ్య ప్రయాణించే రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక సిద్ధిపేట-సికింద్రాబాద్‌ మధ్య ప్రయాణించే రైలును మే 25తేదీన, 26వ తేదీన రద్దు చేశారు. ఈ తేదీలకు అనుగుణంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..