ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులో గుట్టుగా ఆ యవ్వారం.. సీన్ కట్ చేస్తే.!

పంజాబ్‌లో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయింది. 16.8 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఒక మహిళతో సహా నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులో గుట్టుగా ఆ యవ్వారం.. సీన్ కట్ చేస్తే.!
Car

Updated on: Apr 08, 2026 | 9:23 PM

పంజాబ్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా పాకిస్థాన్ మద్దతుతో నడుస్తున్న ఒక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను పంజాబ్ పోలీసులు చేధించారు. ఈ ఆపరేషన్‌లో సుమారు 16.8 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని, ఒక మహిళతో సహా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. అరెస్ట్ అయిన వారిని బల్విందర్ సింగ్(కపుర్తలా), సుమన్ ప్రీత్ కౌర్, హర్పాల్ సింగ్, జస్కరణ్‌బీర్ సింగ్(అమృత్‌సర్)గా గుర్తించారు. వీరు మారుతీ బలెనో కారులో డ్రగ్స్ తరలిస్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో మాటు వేసి పట్టుకున్నారు.

ఇది చదవండి: మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.? ఇది చూస్తే ఇంకెప్పుడూ పడెయ్యరు..

ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ వెనుక పాకిస్థాన్, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాండ్లర్ల హస్తం ఉందని ప్రాథమిక విచారణలో తేలినట్టు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. ఈ హెరాయిన్ నిల్వలను అమృత్‌సర్ సరిహద్దు ప్రాంతం నుంచి సేకరించి, చండీగఢ్‌లో డెలివరీ చేసేందుకు నిందితులు ప్లాన్ చేశారు. కాగా, నిందితుల వద్ద నుంచి డ్రగ్స్‌తో పాటు ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ముఠాకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? గతంలో ఇలాగే ఎన్నిసార్లు డ్రగ్స్ సరఫరా చేశారు? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఇది చదవండి: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..

Follow Us