Minister KTR: ఆగస్టు మొదటివారం నుంచి డబుల్ ఇండ్ల పంపిణీ.. సంచలన ప్రకటన చేసిన మంత్రి కేటీఆర్

Double Bedroom Houses: ఆగస్టు నుంచి అక్టోబర్ మూడవ వారం నాటికి దాదాపు 70 వేల ఇళ్లను పేదలకు అందించనుంది ప్రభుత్వం. లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలని అదేశించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం త్వరలో..

Minister KTR: ఆగస్టు మొదటివారం నుంచి డబుల్ ఇండ్ల పంపిణీ.. సంచలన ప్రకటన చేసిన మంత్రి కేటీఆర్
Minister Ktr

Updated on: Jul 19, 2023 | 9:31 PM

హైదరాబాద్, జూలై 19: ఆగస్టు మొదటివారం నుంచి జీహెచ్ఎంసీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. మంత్రి ఆదేశాల మేరకు ఆరు దశల్లో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేసింది జిహెచ్ఎంసి. ఆగస్టు నుంచి అక్టోబర్ మూడవ వారం నాటికి దాదాపు 70 వేల ఇళ్లను పేదలకు అందించనుంది ప్రభుత్వం. లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలని అదేశించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టబోతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తున్నదని, ఇప్పటికే ఇందులో అత్యధిక భాగం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయిందన్నారు.

మిగిలిన చోట్ల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో లబ్ధిదారుల లిస్టును రెడీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందేలా చూడాలని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో జిహెచ్ఎంసి అధికారులకు ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని సూచించారు.

పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్ ని సిద్ధం చేసింది. ఇప్పటిదాకా ఇన్ సిట్యూ (in -situ) ప్రాంతాల్లో నిర్మించినదాదాపు నాలుగువేల ఇండ్లకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు అందించింది. జిహెచ్ఎంసి రూపొందించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మొదటి వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రారంభం అవుతుంది.

అక్టోబర్ మూడవ వారం వరకు కొనసాగుతుంది. దాదాపు 6 దశల్లో ఇప్పటికే పూర్తయిన సుమారు 65 వేల కు పైగా పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందిస్తారు. వీటికి అదనంగా నిర్మాణం తుది దశలో ఉన్న ఇండ్లను కూడా ఎప్పటికప్పుడు ఈ పంపిణీ కార్యక్రమానికి అదనంగా జత చేసే అవకాశం ఉన్నది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం