Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో శతాబ్ధి రైళ్ల పునరుద్ధరణ

Railway News: కోవిడ్ పాండమిక్ తర్వాత దేశ వ్యాప్తంగా పలు రైళ్లను భారత రైల్వే (Indian Railways) పునరుద్ధరించింది. ఇందులో భాగంగా మరో రెండు శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది.

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో శతాబ్ధి రైళ్ల పునరుద్ధరణ
Shatabdi Express
Image Credit source: TV9 Telugu

Updated on: Jul 14, 2022 | 4:23 PM

Railway Passenger Alert: కోవిడ్ పాండమిక్ తర్వాత దేశ వ్యాప్తంగా పలు రైళ్లను భారత రైల్వే (Indian Railways) పునరుద్ధరించింది. ఇందులో భాగంగా మరో రెండు శతాబ్ధి ఎక్స్‌ప్రెస్(Shatabdi Express) రైళ్లను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. పూణె – సికింద్రాబాద్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ – పూణె శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలును ఆగస్టు 10వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నారు. రైలు నెం.12025 పూణె – సికింద్రాబాద్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రతి రోజూ ఉదయం 06.00 గం.లకు పూణె నుంచి బయలుదేరి మధ్యాహ్నం 02.20 గం.లకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. అలాగే రైలు నెం.12026 సికింద్రాబాద్ – పూణె శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 10వ తేదీ నుంచి మధ్యాహ్నం 02.45 గం.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి.. రాత్రి 11.10 గం.లకు పూణెకి చేరుకుంటుంది.

ఈ శతాబ్ధి రైళ్లు షోలాపూర్, కాలబుర్గి, వాడి, తాండూర్, వికారాబాద్, బేగంపేట్ రైల్వే స్టేషన్లలో ఆగనుంది. రెండు మార్గాల్లోనూ వారంలో మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు ఈ రైళ్లు నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఆన్ లైన్ లేదా నేరుగా రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ల దగ్గర తమ ప్రయాణ టికెట్లను బుకింగ్స్ చేసుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

Loading...
Unable to load recommendations.
Follow Us