
ఈరోజు హైదరాబాద్ వాసులు ఒక అద్భుతమైన ఖగోళ వింతను చూశారు. దీనిని ‘జీరో షాడో డే లేదా ‘శూన్య నీడ దినోత్సవం అని పిలుస్తారు. సంవత్సరంలో రెండు సార్లు సూర్యుడు సరిగ్గా మన నెత్తి మీదికి వస్తాడు. ఆ సమయంలో సూర్యకిరణాలు నిలువుగా పడటం వల్ల, భూమిపై నిటారుగా ఉన్న ఏ వస్తువు నీడ కూడా పక్కకు పడకుండా, సరిగ్గా ఆ వస్తువు కిందనే ఉండిపోతుంది. దీనివల్ల వస్తువుల నీడలు మాయమైనట్లు కనిపిస్తాయి.
సరిగ్గా అలాంటిదే ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేశాము.సరిగ్గా మధ్యాహ్నం 12:12 గంటలకు మన నీడ మయం అయింది.ఈ సన్నివేశం కేవలం ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు మాత్రమే కనిపిస్తుంది.
భూమి తన అక్షం మీద 23.5 డిగ్రీల వంపుతో తిరగడం వల్ల, సూర్యుడు ఉత్తరాయణం మరియు దక్షిణాయనం మధ్య కదులుతున్నట్లు కనిపిస్తాడు. ఈ క్రమంలో ఉత్తర అక్షాంశం 23.5 మరియు దక్షిణ అక్షాంశం మధ్య ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ జీరో షాడో డే సంభవిస్తుంది. హైదరాబాద్ భౌగోళికంగా ఈ పరిధిలోనే ఉండటం వల్ల మనకు ఈ అవకాశం కలిగింది.
నగరంలోని బిర్లా ప్లానిటోరియంతో పాటు పలు విద్యా సంస్థలు ఈ దృశ్యాన్ని వీక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.మీరు ఈ వింతను మిస్ అయితే ఆగస్టు 3వ తేదీన కూడా ఇంచుమించు మధ్యాహ్నం 12:20 నుండి 12:24 గంటల మధ్య ఈ దృశ్యాన్ని చూడవచ్చు.అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..