
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న క్రమంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.. వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకా సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానానికి శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లభించలేదు. దీంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ అయ్యేందుకు ఏటీసీ అనుమతి ఇవ్వలేదు.
ఈ కారణంగా కాసేపు గాల్లోనే చెక్కర్లు కొట్టిన విమానం.. ఆ తర్వాత దారి మళ్లించుకొని బెంగూళురు వైపునకు వెళ్లిపోయింది. హైదరారాబాద్ నుంచి బెంగళూరు వెళ్లిన విమానం.. బెంగళూరు ఎయిర్ పోర్టులో సేఫ్గా ల్యాండ్ అయింది. ఈ రాత్రి సీఎం రేవంత్ రెడ్డి అక్కడే బస చేసి.. శనివారం తిరిగి మళ్లీ హైదరాబాద్ చేరుకోనున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.