Telangana: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అకాల మరణం.. భార్య సమాధి వద్ద భర్త ఆత్మహత్య

|

Aug 08, 2022 | 10:11 AM

ఓ భర్త.. తన భార్య మరణించిన రెండేళ్లు అయినా మరచిపోలేకపోయాడు. భార్య ఎడబాటుని తట్టుకోలేని.. ఆ భర్త భార్య సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిలాల్లో చోటు చేసుకుంది.

Telangana: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అకాల మరణం.. భార్య సమాధి వద్ద భర్త ఆత్మహత్య
Telangana
Follow us on

Telangana: ప్రేమ ఇద్దరు వ్యక్తులను ఏకం చేస్తే.. అదే ప్రేమ కొందరి వ్యక్తుల మధ్య విషాదాన్ని కూడా మిగులుస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను రకరకాల కారణాలతో మోస చేసిన ప్రభుద్ధులకు చెందిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. అయితే కొందరు భర్తలు తమ భార్యను ప్రాణంలో ప్రాణంగా ప్రేమిస్తారు.. భార్య తమని విడిచి శాశ్వతంగా వెళ్తే.. ఆ దుఃఖాన్ని భరించలేక ఆవేదన కు గురవుతారు. అయితే ఓ భర్త.. తన భార్య మరణించిన రెండేళ్లు అయినా మరచిపోలేకపోయాడు. భార్య ఎడబాటుని తట్టుకోలేని.. ఆ భర్త భార్య సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిలాల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల పుట్ట సురేష్.. అదే గ్రామానికి చెందిన నిర్మల అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య నిర్మల అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మరణించింది. భార్య అకాల మరణాన్ని సురేష్ తట్టుకోలేకపోయాడు. భార్య లేని జీవితం తనకు వద్దు అంటూ.. భార్య నిర్మల సమాధి వద్ద భర్త సురేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈనెల రెండవ తారీఖున ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్యాప్రయత్నం చేసిన సురేష్ ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. సురేష్ మృతి చెందాడు. సురేష్ మృతితో కుటుంబంలో  గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకొన్న రాజంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..