Telangana: నిజామాబాద్ లో అమానుష ఘటన.. చెట్టుకింద అపస్మారక స్థితిలో ఆడశిశువు

|

May 12, 2022 | 1:26 PM

పాపం, పుణ్యం, ఏదీ తెలియని పాలబుగ్గల పసిపాపాయి. ఆడబిడ్డగా పుట్టిన నేరానికి అనాథగా మారింది. చెట్టుకింద అపస్మారక స్థితిలో కనిపించిన ఓ పసిబిడ్డ సంచలనంగా మారింది. నిజామాబాద్‌ జిల్లాలో...

Telangana: నిజామాబాద్ లో అమానుష ఘటన.. చెట్టుకింద అపస్మారక స్థితిలో ఆడశిశువు
child
Follow us on

పాపం, పుణ్యం, ఏదీ తెలియని పాలబుగ్గల పసిపాపాయి. ఆడబిడ్డగా పుట్టిన నేరానికి అనాథగా మారింది. చెట్టుకింద అపస్మారక స్థితిలో కనిపించిన ఓ పసిబిడ్డ సంచలనంగా మారింది. నిజామాబాద్‌ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికులను కలవరపెడుతోంది. చూడముచ్చటగా ముద్దులొలుకుతోన్న ఈ పసిపాపాయిని వదిలేసిందెవరో తెలియదు. అభం శుభం తెలియని ఆ పసిబిడ్డను ఏ తల్లి కన్నదో తెలియదు. మండుటెండలో చెట్టుకింద నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళారు. ఎంత సేపటి నుంచి ఈ పాపాయి ఆ చెట్టుకింద ఉందో తెలియదు. అసలే ఎండలు. అందులోనూ ఏడ్చి ఏడ్చి గొంతెండి ఉంటుంది. అమ్మరానేలేదు. నాన్న రాడు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లింది. అపస్మారక స్థితిలోకి చేరుకుంది. రోడ్డునపోయే వారెవరో చూసి, ఆ పసిబిడ్డను ఆసుపత్రిలో చేర్పించడంతో ప్రాణాలు దక్కాయి. అపస్మారక స్థితిలో చిన్నారి, నీళ్లు ఆహారం లేక స్పృహ తప్పి ఉండొచ్చు అంటున్నారు ఆస్పత్రి సిబ్బంది. ఆడపిల్లల సామాజిక వెలివేతకు ప్రత్యక్ష సాక్ష్యంగా మారిన ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ముక్కుపచ్చలారని పాపాయిని వీధిన పడేసిన అమానుష ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

ఇవి కూడా చదవండి

PM Narendra Modi: రంజాన్ ఎలా జరుపుకున్నారు యాకుబ్.. ఉద్వేగానికి లోనైన ప్రధాని మోడీ.. వీడియో

Andhra Pradesh: విద్యావ్యవస్థను నాశనం చేస్తున్న వారినే ప్రభుత్వం అరెస్టు చేసింది.. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్య