తీర్పు ఎలా ఉండాలంటే.!, ఆయన్ను ఫామ్ హౌస్ నుంచి సెక్రటేరియేట్‌కు తీసుకురావాలి: ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే

|

Feb 17, 2021 | 11:54 AM

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓరుగల్లు ప్రజలు ఇచ్చే తీర్పుతో సీఎం కేసీఆర్‌ను ఫామ్ హౌస్ నుంచి సెక్రెటరియేట్ కు తీసుకురావాలని చెప్పుకొచ్చారు..

తీర్పు ఎలా ఉండాలంటే.!, ఆయన్ను ఫామ్ హౌస్ నుంచి సెక్రటేరియేట్‌కు తీసుకురావాలి: ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే
Raghunandan-Rao
Follow us on

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓరుగల్లు ప్రజలు ఇచ్చే తీర్పుతో సీఎం కేసీఆర్‌ను ఫామ్ హౌస్ నుంచి సెక్రటేరియేట్‌ కు తీసుకురావాలని చెప్పుకొచ్చారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. వరంగల్ హంటర్ రోడ్ లోని అభిరామ్ గార్డెన్స్ లో సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుబ్బాక ఎన్నికల ఫలితంతో కేసీఆర్ కు కనువిప్పు కలిగి.. నిరుద్యోగ భృతి ప్రకటన చేశారని…. హైదరాబాద్ ఫలితం కేటీఆర్ ను భూమి మీదకు దించిందని అన్నారు. ఎల్ ఆర్ ఎస్ ను రద్దు చేసేలా చేసిందని ఆయన ఎద్దేవా చేశారు. వరంగల్ ప్రజలు ఇచ్చే తీర్పుతో కేసీఆర్ సెక్రటరేట్ కు రావాలన్నారు.

Read also : AP Panchayat Elections 2021 live: ఏపీలో కొనసాగుతోన్న మూడో విడత పంచాయతీ ఎన్నికలు.. క్యూ కట్టిన ఓటర్లు..