ధరణి పోర్టల్‌ దేశానికే మార్గదర్శకం.. సీఎం కేసీఆర్

భూముల కుంభకోణం, అవినీతిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్‌ ఆవిష్కృతమైంది. మూడు చింతలపల్లిలో సీఎం కేసీఆర్‌ పోర్టల్ ప్రారంభించారు. నవంబర్‌ 2 నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ధరణి పోర్టల్‌లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల రికార్డులు ఉన్నాయన్నారు. తెలంగాణ పోరాట యోధుడు వీరారెడ్డి పుట్టిన గ్రామం కాబట్టే ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి మూడుచింతలపల్లిని ఎంపిక చేశామన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ […]

ధరణి పోర్టల్‌ దేశానికే మార్గదర్శకం.. సీఎం కేసీఆర్

Updated on: Oct 29, 2020 | 2:31 PM

భూముల కుంభకోణం, అవినీతిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్‌ ఆవిష్కృతమైంది. మూడు చింతలపల్లిలో సీఎం కేసీఆర్‌ పోర్టల్ ప్రారంభించారు. నవంబర్‌ 2 నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ధరణి పోర్టల్‌లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల రికార్డులు ఉన్నాయన్నారు. తెలంగాణ పోరాట యోధుడు వీరారెడ్డి పుట్టిన గ్రామం కాబట్టే ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి మూడుచింతలపల్లిని ఎంపిక చేశామన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీరందించామని.. తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్నామన్నారు. 24 గంటలు అన్ని రంగాలకు విద్యుత్‌ సరఫరా చేసే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. దేశానికి తెలంగాణ నుంచి 55 శాతం వడ్లు సరఫరా చేశామన్న కేసీఆర్‌..తెలంగాణ తలసరి ఆదాయంలో ఐదో స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ వెనుకబడ్డ రాష్ర్టం కాదని.. వెనుకకు నెట్టబడ్డ రాష్ర్టమన్నారు కేసీఆర్.

Loading...
Unable to load recommendations.
Follow Us