Road Accident: శుభకార్యానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం

శుభకార్యానికి వెళ్తుండగా సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారితో సహా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Road Accident: శుభకార్యానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం
Car Accident
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 25, 2024 | 8:29 AM

శుభకార్యానికి వెళ్తుండగా సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారితో సహా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఎల్‌ గోవిందాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కారులో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పయనమయ్యారు. విజయవాడ సమీపంలో ఉన్న గుణదలలోని టెంపుల్ లో చిన్నారికి చెవులు కుట్టించేందుకు బయలుదేరారు. కారులో మొత్తం పది మంది ప్రయాణిస్తున్నారు. కోదాడ పట్టణ సమీపంలోని దుర్గాపురంలో అప్పటికే బ్రేక్ డౌన్ అయి లారీ ఆగిపోయింది. దీన్ని గమనించని కారు వేగంగా వచ్చి, ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురు ఘటనాస్థంలోనే చనిపోగా, గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మృతులంతా ఒకే కుటుంబం

మృతులలను ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఎల్ గోవిందపురం చెందిన వారుగా గుర్తించారు. ఒకరు కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని, హైదరాబాద్ నుండి విజయవాడ గుణదల దేవాలయంలో పాపకు చెవులు కుట్టించేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిని మాణిక్యమ్మ, చందర్రావు, కృష్ణంరాజు స్వర్ణ, శ్రీకాంత్, లాస్యగా నిర్ధారించారు.

గాయపడ్డ వారిలో నాగమణి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకొని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం ధాటికి కారు లారీ కిందకు వెళ్లిపోయింది. లారీ వెనుక భాగంలో ఇరుక్కున్న కారును బయటికి తీసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. బయటకు తీసిన మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఆగి ఉన్న లారీని గమనించకుండా వేగంగా కారు ఢీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. జాతీయ రహదారిపై ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. బ్లాక్ స్పాట్స్ లను గుర్తించడంతోపాటు స్పీడ్ గనులను కూడా ఏర్పాటు చేస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డే చెప్పారు.

రెండు రోజుల క్రితం…

మునగాల మండలం ముకుందాపురం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో యువ దంపతులు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్..
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్..
ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో..ఇది కాదా అభిమానులకు కావాల్సింది
ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో..ఇది కాదా అభిమానులకు కావాల్సింది