
మనిషిని మనిషి చంపుకోవటమే దారుణం.. అలాంటిది అయినవాళ్లు తమ ఆత్మీయులను, కుటుంబసభ్యులను దారుణంగా కడతేర్చటం.. ఇంకా గుండెల మీద వేసుకుని పెంచిన కన్నతల్లిని చంపిన కన్నకొడుకు.. జన్మనిచ్చిన తండ్రిని అతి కిరాతకంగా హత్య చేసిన పుత్రరత్నం.. ఎంతో అనురాగంతో పెంచి పెద్దచేసిన తాతయ్యను కసితీరా కత్తిపోట్లతో కడతేర్చే మనుమడు.. ఇంకా నాతిచరామి అంటూ ఏడడుగులు వేసిన భర్తను పైలోకాలకు పంపే భార్య.. అలాగే ఇంటి దీపాన్ని ఆర్పేసుకునే మరో మూర్ఖుడు.. ఇలా ఒకటేమిటి… కన్నవారిని, కట్టుకున్నవారినీ, ఇంకా చెప్పాలంటే అయినవారినీ, తమవారినే పొట్టనపెట్టుకుంటున్న కిరాతకులు రోజుకొకరు కనిపిస్తున్నారు.. అసలు మనిషనేవాడు మాయమైపోతున్నాడనే కవి మాటను నిజం చేస్తున్నారు. చికెన్ కోసం కోడిని చంపినంత ఈజీగా, మటన్ కోసం మేక గొంతు కోసినంత ఈజ్గా.. సాటి మనిషిని చంపేస్తున్నారు. ఒక దగ్గర చెరువులో బాడీ పార్ట్స్ కనిపించాయి. మనిషి ఆకారంలో వచ్చేంత వరకు ఎక్కడెక్కడో పడేసిన ఆ శరీర భాగాలను తీసుకొచ్చి కలిపితే.. మొత్తం ఐదు ముక్కలుగా నరికి పడేశారని అర్థమైంది. కారకులు ఎవరా అని ఆరా తీస్తే.. భార్యే ఆ పని చేసిందని తేలింది. ఎందుకు చంపావ్ అని పోలీసులు తమ స్టైల్లో అడిగితే.. ‘పరాయి మగాడి కోసం’ అని చెప్పింది. భర్త స్నేహితుడితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ ఇల్లాలు.. అడ్డుగా ఉన్నాడని ఇంటాయన్నే కిరాతకంగా చంపేసింది. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో జరిగిందీ ఘోరం. ‘ఇలాంటోళ్లు కూడా ఉంటారా’ అనే సంఘటన నెల...