Telangana: వలసలతోనే అధికారం నిలబడుతుందా? జంపింగ్స్‌లో అందరిదీ గురవింద సామెతేనా?

|

Mar 18, 2024 | 6:59 PM

తెలంగాణలో ముచ్చటగా మూడో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా రాజకీయవలసలకు గేట్లు తెరుచుకున్నాయి. నాడు బీఆర్ఎస్‌లోకి వరద కొట్టుకురాగా.. ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు కొట్టుకొస్తోంది. నాడు తప్పన్నవాళ్లే ఇప్పుడు తప్పదంటున్నారు.. అప్పుడు రైట్‌ అన్నవాళ్లు ఇప్పుడు యాక్షన్‌ ప్లీజ్‌ అంటూ స్పీకర్‌ వద్దకు పరుగులు తీస్తున్నారు.

Telangana: వలసలతోనే అధికారం నిలబడుతుందా? జంపింగ్స్‌లో అందరిదీ గురవింద సామెతేనా?
Big News Big Debate
Follow us on

వలసల వరద కూడా మొదలైంది.. 2014లో హైదరాబాద్‌లోని తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ రూపంలో వలసలకు బీఆర్ఎస్‌ శ్రీకారం చుడితే.. ఇప్పుడు అదే హైదరాబాద్‌ మహానగరంలోని ఖైరతాబాద్‌ నుంచి దానం నాగేందర్‌ రూపంలో కాంగ్రెస్‌లోకి జంపింగ్స్‌ మొదలయ్యాయి..Spot
దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్‌ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. జంపింగ్స్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ తప్పు చేస్తే మీరు కూడా అదే పొరపాటు చేస్తారా అంటూ ప్రశ్నించారు మాజీ ఎంపీ వినోద్‌. కోర్టు తీర్పులు, ప్రజాప్రాతినిధ్య చట్టాలకు అనుగుణంగా స్పీకర్‌ వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు బీఆర్ఎస్‌ నేతలు.

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉందంటోంది కాంగ్రెస్‌. 10 యేళ్ళ పాటు విచ్చలవిడిగా ప్రోత్సహించింది బీఆర్ఎస్‌ కాదా అని ప్రశ్నిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు బలి కావడానికి సిద్ధంగా లేమన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.

మరోవైపు బిఎస్పీ పార్టీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌ ఆఫర్ నిజమే అయినా… ఎవరో గేట్లు తెరిస్తే చేరుతున్న గొర్రెల మందలో ఒక్కడిగా ఉండలేనంటూ కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఐపీఎస్‌. ఇక నాడు కేసీఆర్‌ చేసిన తప్పే మళ్లీ రేవంత్‌ చేస్తున్నారని మండిపడుతోంది బీజేపీ.

ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికే వలసలను ప్రోత్సహిస్తున్నామని నాడు బీఆర్ఎస్‌ చెప్పింది.. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే నినాదంతో ఫిరాయింపులకు శ్రీకారం చుట్టింది. మరి పార్లమెంట్‌లో ఈ వలసల ప్రభావం ఉంటుందా?  అన్నది ఇంట్రస్టింగ్ టాపిక్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..