Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోమారు కరోనా పరీక్షలు.. ఎందుకంటే..!

Telangana CM KCR:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోసారి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించినట్లు సీఎం వ్యక్తిగత వైద్యులు డాక్టర్‌ ఎంవీ రావు తెలిపారు. అయితే బుధవారం..

Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోమారు కరోనా పరీక్షలు.. ఎందుకంటే..!

Updated on: Apr 29, 2021 | 10:17 PM

Telangana CM KCR:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోసారి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించినట్లు సీఎం వ్యక్తిగత వైద్యులు డాక్టర్‌ ఎంవీ రావు తెలిపారు. అయితే బుధవారం నిర్వహించిన యాంటీజెన్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు మిశ్రమంగా వచ్చినట్లు తెలిపారు. నిన్నటి యాంటీజెన్‌ టెస్ట్‌ రిపోర్టులో ఫలితం నెగెటివ్‌గా వచ్చిన విషయం తెలిసిందే.

కాగా, ఆర్టీపీసీఆర్‌ పరీక్ష రిపోర్టులో ఖచ్చితమైన ఫలితం రాలేదని ఎంవీ రావు తెలిపారు. వైరస్‌ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి ఖచ్చితమైన ఫలితాలు రావని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. రెండు, మూడు రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

కేసీఆర్‌కు స్వల్పంగా కోవిడ్‌ లక్షణాలు ఉండటంతో యాంటీజెన్స్‌ పరీక్షలు చేయగా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించడంతో వ్యవసాయ క్షేత్రంలోనే సీఎం కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల బృందం ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

ఇవీ చదవండి:

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!

Corona Pandemic: కోవిడ్ వార్డులో వైద్య సిబ్బంది భాంగ్రా డ్యాన్స్..కరోనా పేషెంట్ల ఉత్సాహం..ఇంటర్నెట్ లో చూసిన వారికి ఉల్లాసం!

Jagan on Vaccination: వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌పై కీలక వ్యాఖ్యలు.. ఫిబ్రవరి దాకా సాధ్యం కాదని వ్యాఖ్య

Loading...
Unable to load recommendations.
Follow Us