MLA Roja: యాదాద్రీశుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా.. దేవుడే సీఎం కేసీఆర్‌తో ఇలా..

|

Feb 12, 2022 | 4:49 PM

Roja Yadadri Darasnam: తెలుగు సినీ నటి(Actress Roja), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఎమ్మెల్యే రోజా(MLA Roja) ఇవాళ యాదాద్రిలో పర్యటించారు(Yadadri Temple).

MLA Roja: యాదాద్రీశుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా.. దేవుడే సీఎం కేసీఆర్‌తో ఇలా..
Mla Roja
Follow us on

Roja Yadadri Darasnam: తెలుగు సినీ నటి(Actress Roja), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఎమ్మెల్యే రోజా(MLA Roja) ఇవాళ యాదాద్రిలో పర్యటించారు(Yadadri Temple). యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ఆలయాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రోజా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. యాదాద్రి వైభవాన్ని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవన్నారు. ఆ నరసింహ స్వామే కేసీఆర్‌తో ఇంత మంచి గుడి కట్టించుకున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గుడి కట్టాలంటే భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, సీఎం కేసీఆర్‌ అందరి సహకారంతో, దేవుడి ఆశీస్సులతో ఆలయాన్ని నిర్మించారని కొనియాడారమే. యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా నిర్మిస్తున్నారని అన్నారు. యాదాద్రిని ప్రపంచ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఆయన సంకల్పం మెచ్చుకోదగిదనన్నారు. ఈ కాలంలో ఏ నాయకుడికీ దక్కని అవకాశం కేసీఆర్‌కి దక్కిందన్నారు. నూతన ఆలయాన్ని అద్భుతంగా డిజైన్ చేసి పునఃనిర్మాణం చేశారని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ అన్నదమ్ములే అనడానికి ఈ గుడి ఒక ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి వాడిన రాయిని గుంటూరు నుంచి తీసుకువచ్చారని, ఈ కారణంగానే.. తెలుగువారు ఎప్పటికీ అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెల్లుగా కలిసి ఉంటారని పేర్కొన్నారు. కాగా, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రోజాకు అర్చకులు వేదాశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.

Also read: