
ఒకప్పుడు గుండె పోటు అంటే చాలా అరుదుగా, అది కూడా పలు రకాల చెడు వ్యసనాలు ఉన్నవారికి మాత్రమే వస్తుందనే భావనలో ఉండేవాళ్లం. కానీ ప్రస్తుతం పట్టుమని పాతికేళ్లు నిండని వారికి కూడా గుండె పోటు రావడం ఆందోళన కలిగిస్తోంది.
మరీ ముఖ్యంగా కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో చిట్టి గుండెలు ఇట్టే ఆగిపోతున్నాయి. అసలు ఈ గుండెకు ఏమైందన్న అనుమానాలు వచ్చాయి. అసలు గతంలో ఎప్పుడూ గుండె పోటు రాని వారు, చాలా తక్కువ వయసులో ఉన్న వారు కూడా గుండె పోటుకు గురవుతోన్న సంఘటనలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. అప్పటి వరకు సరదాగా ఉన్న వాళ్లు ఒక్కసారిగా కుప్పికూలిపోయిన సంఘటనలు అందరినీ షాక్కి గురి చేశాయి.
ఇంటర్నెట్ విస్తృతి పెరగడం, అందరికీ స్మార్ట్ ఫోన్లు, వీడియోలు అందుబాటులోకి రావడంతో ఇలా ఉన్నపలంగా గుండెపోటుతో మరణిస్తున్న వారికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ షాకింగ్ సంఘటన హుజురాబాద్లో జరిగింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కొందరు మహిళలు సరదాగా దాండియా ఆడారు.
కోలలు పట్టుకొని సంతోషంగా దాండియా ఆడుతూ సందడి చేశారు. అయితే వారిలో ఓ మహిళలకు ఉన్నట్లుండి ఏమైందో ఏమో తెలియదు కానీ దాండియా ఆడుతున్నట్లే ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. దీంతో వెంటనే ఆమెను వైద్యుల దగ్గరికీ తీసుకెళ్లగా ఆ మహిళ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చిచెప్పారు. ఇదంతా అక్కడే ఉన్న కొందరు స్మార్ట్ ఫోన్లో రికార్డ్ చేయడంతో ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. అప్పటి వరకు సరదగా గడిపిన మహిళ ఉన్నపలంగా మరణించడం ఆమెతా పాటు దండియా ఆడిన మహిళలకు షాక్కి గురి చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..