Jawans Killed: తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో దారుణం.. తోటి జవాన్లపై మరో జవాన్ కాల్పులు..
Chhattisgarh Firing : తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రా సరిహద్దుల్లో దారుణం చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ జవాన్.. సహచర జవాన్లపై గన్తో విరుచుకుపడ్డాడు.
Chhattisgarh Firing : తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రా సరిహద్దుల్లో దారుణం చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ జవాన్.. సహచర జవాన్లపై గన్తో విరుచుకుపడ్డాడు. తోటి జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు సుకుమా జిల్లా మారాయిగూడెం లింగంపల్లి బేస్ క్యాంప్లో చోటు చేసుకుంది. గాయపడిన జవాన్లను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అధికారులు. గాయపడిన జవాన్లు ధర్మాత్మా కుమార్, ధర్మేంద్ర, మహారణ, ధనుంజయ్. మృతి చెందిన జవాన్లు రాజాం మని యాదవ్(బిహార్), దంజి(బిహార్), రాజీవ్ మండల్(పశ్చిమ బెంగాల్). సహచర జవాన్లకు ఎందుకు కాల్పులకు తెగబడ్డాడనేది తెలియరాలేదు. కాగా, నిందిత జవాన్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Also read:
Horoscope Today: ఆ రాశుల వారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.. ఈ రోజు రాశి ఫలాలు..
Post Office: మీరు ఇన్వెస్ట్ చేసే పథకాల్లో మోసపోయారా..? టెన్షన్ వద్దు.. ఫిర్యాదు చేయండిలా..!