Viral: పెన్నా నది దగ్గర తవ్వకాలు జరపగా దొరికిన మిరిమిట్లుగొలిపే రాయి.. ఏంటా అని పరిశీలించగా

ఇద్దరు యువకులు తమ చెల్లెళ్ళ పెళ్లి జరిపేందుకు ఆలోచన చేస్తుండగా.. పెన్నా నది తీరం వెంబడి ఓ గని లీజుకు తీసుకున్నారు. తమ అదృష్టాన్ని ఎలాగైనా పరీక్షించుకోవాలని అనుకున్నారు. ఈలోపు తవ్వకాల్లో వారికి ఓ రాయి దొరికింది. అదేంటి అని చూడగా..

Viral: పెన్నా నది దగ్గర తవ్వకాలు జరపగా దొరికిన మిరిమిట్లుగొలిపే రాయి.. ఏంటా అని పరిశీలించగా
Penna River

Updated on: Dec 10, 2025 | 11:48 AM

కష్టపడి కుటుంబ బాధ్యతలు మోస్తున్న ఇద్దరు యువకుల కష్టం ఫలించింది. ఓ వజ్రం వారి తలరాతను రాత్రికి రాత్రే మార్చేసింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ, తమ సోదరీమణుల వివాహాలు ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్న ఇద్దరు స్నేహితులకు ఎంతో ఉపశమనాన్నిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో వారు లీజుకు తీసుకున్న గనిలో జరిపిన తవ్వకాల్లో ఏకంగా రూ.50 లక్షల విలువైన వజ్రం దొరికింది.

పెన్నాలోని రాణిగంజ్‌కు చెందిన సతీశ్ మాంసం దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని స్నేహితుడు సాజిద్ పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరివీ నిరుపేద కుటుంబాలు కావడంతో ఎన్నాళ్లు ఇలా కష్టపడాలి.. ఎప్పుడు మన కష్టాలు తీరుతాయి.. మన చెల్లెళ్ల పెళ్లి ఎలా చేయాలి అని బాధపడుతున్న వారికి ఓ ఆలోచన వచ్చింది. పెన్నాలోని ఓ గనిని లీజుకు తీసుకొని ఒక్కసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 20 రోజుల క్రితం ఓ చిన్న గనిని లీజుకు తీసుకుని తవ్వకాలు ప్రారంభించారు. గతంలో సాజిద్ తండ్రి, తాత కూడా వజ్రాల కోసం ప్రయత్నించినా పెద్దగా ఫలితం రాలేదు. కానీ, ఈ స్నేహితుల ప్రయత్నం ఫలించింది. తవ్వకాలు చేస్తుండగా ఓ మెరిసే రాయి వారి కంటపడింది. దానిని వెంటనే స్థానిక డైమండ్ అధికారి వద్దకు తీసుకెళ్లారు. అధికారులు దానిని పరిశీలించి, 15.34 క్యారెట్ల నాణ్యమైన వజ్రంగా నిర్ధారించారు. మార్కెట్‌లో దీని విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. త్వరలోనే ఈ వజ్రాన్ని వేలం వేయనున్నట్లు తెలిపారు. వేలం ద్వారా వచ్చే డబ్బును చెరిసగం పంచుకోవాలని స్నేహితులిద్దరూ ముందే నిర్ణయించుకున్నారు. ఈ డబ్బుతో ముందుగా తమ సోదరీమణుల పెళ్లిళ్లు ఘనంగా చేస్తామని, మిగిలిన మొత్తంతో ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటామని వారు సంతోషం వ్యక్తం చేశారు.