భారతదేశంలో ప్రతి చిన్న అవసరానికి ఆధార్ కార్డు ఆధారంగా మారింది. అయితే పెరుగుతున్న జనాభా నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఇంటికి ఆధార్ కార్డు చేరడం అసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ వెబ్సైట్ ద్వారా నిర్దిష్ట సూచనలను పాటించి ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే మన కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసి ప్రింట్ ఇస్తే అందులో క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. కానీ మీ సేవతో పాటు ఇతర నెట్ సెంటర్స్ కార్డును డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకుంటే మాత్రం టిక్ మార్క్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ టిక్ మార్క్ ఎలా సెట్ చేయాలో? నిపుణులు కొన్ని చనలు చేస్తున్నారు. ఆధార్ కార్డులో చెల్లుబాటు అయ్యే డిజిటల్ సంతకం మీ ఈ-ఆధార్ను ట్యాంపరింగ్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. అలాగే ప్రామాణికతకు కూడా హామీ ఇస్తుంది. అడోబ్ రీడర్ను ఉపయోగించి మీ ఈ-ఆధార్లోని డిజిటల్ సంతకాన్ని ధ్రువీకరించవచ్చు. కాబట్టి అడోబ్ రీడర్తో డిజిటల్ సిగ్నేచర్ను ఎలా వ్యాలిడేట్ చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..