ఆధునిక సాంకేతిక ప్రపంచంలో రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. గిగాఫైబర్తో బ్రాండ్బ్యాండ్ విభాగంలో దూసుకెళ్లాలని చూస్తోంది. కంపెనీ నెలకు రూ.600లతో గిగాఫైబర్ సేవలను ప్రారంభించే అవకాశముందని సమాచారం. గిగాఫైబర్ ప్లానుతో బ్రాండ్బ్యాండ్, టెలివిజన్, ల్యాండ్లైన్ సేవలన్నింటినీ పొందొచ్చని తెలిపింది.
రిలయన్స్ జియో గిగాఫైబర్ సేవలు మరో మూడు నెలల్లో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే కొనసాగుతున్నాయి. తమ ప్రాంతంలో గిగాఫైబర్ సేవలు కావాలనుకునేవాళ్లు https://gigafiber.jio.com/registration వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.