
ఫ్లిప్కార్ట్ కూడా తన కొత్త ఫ్రీడమ్ సేల్ను ప్రారంభించింది. ఈ సేల్లో ఆపిల్, శామ్సంగ్, నథింగ్, రియల్మీ, వివో, మోటరోలా వంటి బ్రాండ్ల నుండి ప్రీమియం స్మార్ట్ఫోన్లపై గణనీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఆగస్టు 1న మధ్యాహ్నం 12 గంటల నుంచే సేల్ స్టార్ట్ అయిపోయింది. ఈ సేల్ ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. దీనిని మరింత పొడిగించే అవకాశం కూడా ఉంది. ఫ్లిప్కార్ట్ కొత్త సేల్లో అందుబాటులో ఉన్న అద్భుతమైన ఆఫర్లను ఒకసారి చూద్దాం..
ఈ సేల్లో ICICI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులతో చేసిన కొనుగోళ్లకు 10 శాతం తక్షణ తగ్గింపు ఉంటుంది. ఇది EMI లావాదేవీలపై కూడా వర్తిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్లతో పాటు, వినియోగదారులు నో-కాస్ట్ EMI ఎంపికలు, ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చు. ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులు అదనపు ప్రయోజనాన్ని పొందుతారు. అదనపు పొదుపు కోసం సూపర్ కాయిన్లను రీడీమ్ చేసుకునే అవకాశం ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి