
ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేయడం అనేది పరిపాటిగా మారింది. చిన్న పట్టణాల నుంచి మెట్రో సిటీస్ వరకూ ప్రతి ఒక్కరూ తమ నచ్చిన రెస్టారెంట్స్లోని ఆహారాన్ని ఇంటికి ఆర్డర్ చేసుకుని ఆశ్వాదిస్తూ ఉంటారు. ఇలా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్లో జొమాటో, స్విగ్గీ యాప్స్ అత్యంత ప్రజాదరణ పొందాయి. తాజాగా భారత క్రికెటర్ దీపక్ చాహర్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోతో తన చెడు అనుభవానికి పంచుకున్నారు. ఓ ట్వీట్లో తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దీపక్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో ఫుడ్ యాప్తో తన తక్కువ అనుభవాన్ని పంచుకున్నాడు. ఇటీవల సీఎస్కే బౌలర్ తన ఆహారాన్ని పంపిణీ చేసినట్లు జొమాటో యాప్ చూపించినప్పటికీ తనకు ఏమీ డెలివరీ చేయకపోవడంతో దేశంలో ఇది “కొత్త మోసం” అని పేర్కొన్నాడు. దీపక్ చాపర్కు జొమాటో వల్ల కలిగిన అనుభవం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
new fraud in India 😂 . Ordered food from @zomato and app shows delivered but didn’t receive anything. After calling the customer service they also said that it’s been delivered and m lying 🤥 . M sure lot of people must be facing same issues. Tag @zomato and tell your story . pic.twitter.com/PwvNTcRTTj
ఇవి కూడా చదవండి— Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) February 24, 2024
దీపక్ చాప్ తన ట్వీట్లో చేస్తూ, “భారతదేశంలో కొత్త మోసం. @ జొమాటో నుంచి నుండి ఆహారాన్ని ఆర్డర్ చేశారని చూపించినా నాకు ఎలాంటి ఆహారం డెలివరర కాలేదు. కస్టమర్ సర్వీస్కి కాల్ చేసిన తర్వాత డెలివరీ అయిందని, నేను అబద్ధం చెబుతున్నానని కూడా చెప్పారు. కచ్చితంగా చాలా మంది ప్రజలు ఇదే సమస్యలను ఎదుర్కొంటారు. @జొమాటోలను ట్యాగ్ చేసి మీ స్పందనను చెప్పండి” అని యాప్కు సంబంధించిన స్క్రీన్షాట్ను ట్విట్టర్లో పెట్టాడు. దీనిపై స్పందించిన జొమాటో కస్టమర్ కేర్కు స్పందించిన ఎక్స్ ఖాతా ప్రత్యుత్తరాల్లో క్రికెటర్కి క్షమాపణ చెప్పింది. “హాయ్ దీపక్, మీ అనుభవం గురించి మేము చాలా చింతిస్తున్నాం. అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాము. మేము అటువంటి సమస్యలను తీవ్రంగా పరిగణిస్తాము, సత్వర పరిష్కారాన్ని నిర్ధారించడానికి ఈ విషయాన్ని అత్యవసరంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది.
జొమాటో స్పందనపై దీపక్ సమాధానం ఇచ్చారు. ఈ సమస్యను చాలా మంది అనుభవిస్తున్నారని అదే తన ట్వీట్కు కారణమని పేర్కొన్నారు. ఈ సమస్యపై కంపెనీ ఎలాంటి చర్య తీసుకోదని, ఆకలికి డబ్బుతో పరిష్కారం అందించలేమని ఆయన అన్నారు. దీపక్ చాహర్ 2018లో బ్రిస్టల్లో ఇంగ్లండ్తో జరిగిన టీ 20ఐ (ట్వంటీ20 ఇంటర్నేషనల్)లో అరంగేట్రం చేశాడు. 2019లో అతను టీ20ఐ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి భారతీయ పురుష క్రికెటర్గా నిలిచాడు. చాహర్ భారత్ తరఫున 7 వన్డేలు, 24 టీ20 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..