విలన్‌గా మిల్కీబ్యూటీ..!

ఇన్ని రోజులు గ్లామర్ పాత్రలో మెరిసిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు విలన్‌గా మారుతోంది. విశాల్ హీరోగా తమిళ్‌లో తెరకెక్కబోతున్న ఓ చిత్రంలో తమన్నా విలన్‌గా కనిపించబోతుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది. కొత్త దర్శకుడు పరిచయం అవ్వబోతున్న ఈ సినిమాలో తాను విలన్‌గా కనిపిస్తున్నట్లు తెలిపింది. ఇది తనకు ఛాలెంజింగ్ రోల్ అంటూ పేర్కొంది. ఇక తెలుగులోనూ ‘రాజు గారి గది 3’లో తమన్నా నటిస్తోంది. రెండు వేరు వేరు కాలాలకు సంబంధించిన కథాంశంతో […]

విలన్‌గా మిల్కీబ్యూటీ..!
Follow us

| Edited By:

Updated on: Mar 16, 2019 | 12:26 PM

ఇన్ని రోజులు గ్లామర్ పాత్రలో మెరిసిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు విలన్‌గా మారుతోంది. విశాల్ హీరోగా తమిళ్‌లో తెరకెక్కబోతున్న ఓ చిత్రంలో తమన్నా విలన్‌గా కనిపించబోతుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది. కొత్త దర్శకుడు పరిచయం అవ్వబోతున్న ఈ సినిమాలో తాను విలన్‌గా కనిపిస్తున్నట్లు తెలిపింది. ఇది తనకు ఛాలెంజింగ్ రోల్ అంటూ పేర్కొంది.

ఇక తెలుగులోనూ ‘రాజు గారి గది 3’లో తమన్నా నటిస్తోంది. రెండు వేరు వేరు కాలాలకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాను రెండు డిఫరెంట్ పాత్రలలో కనిపించనున్నానని మిల్కీబ్యూటీ పేర్కొంది. ఈ రెండు సినిమాల గురించి తాను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. అయితే గ్లామర్ బ్యూటీగా పేరొందిన తమన్నా విలన్‌గా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే . కాగా ఈ సంవత్సరం ‘ఎఫ్‌2’ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తమన్నా.. ప్రస్తుతం సైరా, దటీజ్ మహాలక్ష్మిలో నటిస్తోంది. అలాగే తమిళ్‌లో సుందర్. సి దర్శకత్వంలో విశాల్ సరసన మరో చిత్రంలో నటిస్తోంది.