భారత్-ఆస్ట్రేలియా తొలి టెస్ట్.. టీమిండియా పేలవ ప్రదర్శన.. 244 పరుగులకే ఆలౌట్..

నాలుగు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ అడిలైన్ క్రికెట్ మైదనంలో జరుగుతోంది.

భారత్-ఆస్ట్రేలియా తొలి టెస్ట్.. టీమిండియా పేలవ ప్రదర్శన.. 244 పరుగులకే ఆలౌట్..

Updated on: Dec 18, 2020 | 1:52 PM

నాలుగు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ అడిలైన్ క్రికెట్ మైదనంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 244 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 233/6తో తొలి ఇన్నింగ్స్ రెండో రోజు స్ట్రైకింగ్ ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆసిస్ బౌలర్ల దాటికి నిలవలేక పోయారు. వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. రెండో రోజు ఇన్నింగ్స్‌ కొనసాగించిన సాహా, అశ్విన్ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేశారు. వారి బాటలోనే ఉమేశ్ యావ్, మహ్మద్ షమీ కూడా పయనించారు. బుమ్రా మాత్రం అంతో ఇంతో రాణించాడని చెప్పాలి. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పేలవమైన ప్రదర్శనతో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి 244 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ముగించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారా 43 పరుగులు చేయగా, కోహ్లీ 74 పరుగుల చేసి తన కెప్టెన్‌గా తన విధిని నిర్వర్తించాడు. మయాంక్ అగర్వాల్ 17, అజింక్య రహాన 42, హనుమ విహారి 16 చొప్పున పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు పడగొట్టగా, కమిన్స్ 3, నాథన్ లయన్, హాజిల్ వుడ చెరో వికెట్ చొప్పున తీసుకున్నారు.

 

Also read:

గీత తల్లిదండ్రుల అన్వేషణలో కొత్త ట్విస్ట్‌.. మా కూతురే అంటూ మహబూబాబాద్‌, పెద్దపల్లి నుంచి రెంటు కుటుంబాల రాక..

Namrata Shirodkar : ‘ఇద్దరం..ముగ్గురైన వేళ’, మధుర జ్ఞాపకాలను షేర్ చేసిన నమ్రత..సూపర్ వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us