ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముంబైపై ఆర్‌సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ఐపీఎల్ 2026 నుండి ముంబై అవుట్!

రాయ్‌పూర్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన, తక్కువ స్కోరు నమోదైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు, చివరి బంతికి 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 నుంచి నిష్క్రమించింది.

ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముంబైపై ఆర్‌సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ఐపీఎల్ 2026 నుండి ముంబై అవుట్!
Rcb Vs Mi

Updated on: May 10, 2026 | 11:59 PM

రాయ్‌పూర్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన, తక్కువ స్కోరు నమోదైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు, చివరి బంతికి 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 నుంచి నిష్క్రమించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠగా సాగిన పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి క్వాలిఫైయర్-2కు దూసుకెళ్లింది. ఈ ఓటమితో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ కుమార్ తన పదునైన బంతులతో ముంబై టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. కేవలం మూడు ఓవర్ల వ్యవధిలోనే ముగ్గురు కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ముఖ్యంగా భువీ వేసిన ఒకే ఓవర్‌లో రోహిత్ శర్మ (22), సూర్యకుమార్ యాదవ్ వరుస బంతుల్లో అవుట్ కావడంతో ముంబై ఆత్మరక్షణలో పడింది. ఈ దశలో నమన్ ధీర్, తిలక్ వర్మ ధైర్యంగా పోరాడారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 82 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. తిలక్ వర్మ బాధ్యతాయుతమైన అర్ధసెంచరీతో మెరిశాడు. అయితే, చివరి ఓవర్లలో భువనేశ్వర్ మళ్ళీ విజృంభించి తిలక్‌ను అవుట్ చేయడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. భువీ మొత్తం 4 వికెట్లు పడగొట్టాడు.

167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి కూడా ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. పేసర్ దీపక్ చాహర్ నిప్పులు చెరిగే బంతులతో విరాట్ కోహ్లీని డకౌట్ చేశాడు. కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సున్నాకే వెనుదిరగడం అభిమానులను నిరాశపరిచింది. పవర్‌ప్లే ముగిసేసరికి పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్ వికెట్లను కూడా కోల్పోయి ఆర్‌సీబీ కష్టాల్లో పడింది. ఆ సమయంలో కృనాల్ పాండ్యా, యువ ఆటగాడు జాకబ్ బెథెల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కృనాల్ కేవలం 32 బంతుల్లోనే మెరుపు అర్ధసెంచరీ సాధించి మ్యాచ్‌ను ఆర్‌సీబీ వైపు తిప్పాడు. చివర్లో జితేష్ శర్మ మెరుపులు మెరిపించడంతో సమీకరణం చివరి బంతికి మారింది. ఆఖరి బంతికి కావాల్సిన పరుగును సాధించి ఆర్‌సీబీ సంచలన విజయాన్ని నమోదు చేసింది.

మరోవైపు, కాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ, కృనాల్ నిలకడగా ఉంటూ 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టి జట్టును తిరిగి క్రీజులోకి తీసుకువచ్చాడు. చివరి ఓవర్‌లో బెంగళూరుకు 15 పరుగులు అవసరమయ్యాయి. రాజ్ అంగద్ బావా ఓవర్‌లో రొమారియో షెపర్డ్ అవుటయ్యాడు. కానీ క్రీజులోకి వచ్చిన వెంటనే భువనేశ్వర్ కుమార్ ఒక సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత, చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా, రసిఖ్ సలాం రెండు పరుగులు తీసి జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us