Tokyo Paralympics: పారాలింపిక్స్‌లో ప్రమోద్‌ భగత్‌ సంచలనం.. స్వర్ణంతో మురిసిన భారత బ్యాడ్మింటన్‌!

|

Sep 04, 2021 | 5:27 PM

Pramod Bhagat: టోక్యో పారాలింపిక్స్‌లో భార‌త్‌కు మరో ప‌సిడి ప‌త‌కం వరించింది. ఈ పారాలింపిక్స్‌లో ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ ప‌తకాలు సాధించ‌గా.. తాజాగా మ‌రోకరికి స్వర్ణం

Tokyo Paralympics: పారాలింపిక్స్‌లో ప్రమోద్‌ భగత్‌ సంచలనం.. స్వర్ణంతో మురిసిన భారత బ్యాడ్మింటన్‌!
Pramod Bhagat
Follow us on

Pramod Bhagat: టోక్యో పారాలింపిక్స్‌లో భార‌త్‌కు మరో ప‌సిడి ప‌త‌కం వరించింది. ఈ పారాలింపిక్స్‌లో ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ ప‌తకాలు సాధించ‌గా.. తాజాగా మ‌రోకరికి స్వర్ణం వరించింది. ఈ సాయంత్రం జ‌రిగిన బ్యాడ్మింట‌న్ మెన్స్ సింగిల్స్ ఫైన‌ల్ మ్యాచ్‌లో షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ ఘ‌న విజ‌యం సాధించాడు. బ్రిట‌న్‌కు చెందిన డేనియ‌ల్ బెథెల్‌ను 21-14, 21-17 తేడాతో రెండు వ‌రుసగా రెండు సెట్లల్లో 45 నిమిషాల్లో ఓడించి ప‌సిడి ప‌త‌కాన్ని కైవసం చేసుకున్నాడు.

దీంతోపాటు పారాలిపిక్స్‌లో ఇదే విభాగంలో మనోజ్‌ సర్కార్‌ సైతం కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మనోజ్ సర్కార్ జపాన్‌కు చెందిన డైసుకే ఫుజిహారాను 22-20 21-13 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. దీంతో పారాలింపిక్స్‌లో భార‌త క్రీడాకారులు సాధించిన స్వర్ణ ప‌త‌కాల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో మొత్తం ప‌త‌కాల సంఖ్య 17కు చేరింది. 4 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్యాలతో పతకాల జాబితాలో భారత్‌ 25 వ స్థానానికి ఎగబాకింది.

కాగా.. పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో సత్తా చాటిన స్వర్ణ, కాంస్య పతకాలు సాధించిన ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్‌లకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రమోద్ భగత్, మనోజ్‌ సర్కార్‌ అద్భుతమైన ఆటతో దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారంటూ కొనియాడారు. ఇదిలాఉంటే.. ప్రమోద్‌ భగత్‌.. పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచాడు.

Also Read:

IND vs ENG 4th Test Day 3 Live: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. కె.ఎల్‌ రాహుల్ 46 పరుగులు ఔట్‌..

Boxer Death: పంచ్‌లకు పోయిన ప్రాణం… 18 ఏళ్లకే ముగిసిన జీవితం.. బాక్సింగ్ బ్యాన్ చేయాలని డిమాండ్