AFC Asian Cup 2023: చరిత్ర సృష్టించిన భారత ఫుట్‌బాల్‌ జట్టు.. సునీల్ ఛెత్రి సారథ్యంలో వరుసగా రెండోసారి..

Indian Football Team: టీమ్ ఇండియా AFC ఆసియా కప్ 2023కి అర్హత సాధించింది. సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత జట్టు వరుసగా రెండోసారి ఈ ఘనత సాధించింది.

AFC Asian Cup 2023: చరిత్ర సృష్టించిన భారత ఫుట్‌బాల్‌ జట్టు.. సునీల్ ఛెత్రి సారథ్యంలో వరుసగా రెండోసారి..
Afc Asian Cup

Updated on: Jun 14, 2022 | 3:19 PM

భారత ఫుట్‌బాల్ జట్టు వరుసగా రెండోసారి AFC ఆసియా కప్‌కు అర్హత సాధించింది. ఫిలిప్పీన్స్‌పై పాలస్తీనా 4-0 తేడాతో విజయం సాధించిన తర్వాత భారత్ ఈ ఘనత సాధించింది. మంగళవారం (జూన్ 14) జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో భారత్ ఓడిపోయినా క్వాలిఫికేషన్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. ఓవరాల్‌గా ఈ టోర్నీకి భారత జట్టు ఐదోసారి అర్హత సాధించింది. అలాగే భారత జట్టు వరుసగా రెండు పర్యాయాలు ఈ టోర్నీలో పాల్గొనడం ఇదే తొలిసారి. భారత్ తొలిసారిగా 1964లో ఈ టోర్నీలో పాల్గొంది. ఆ తర్వాత 1984, 2011, 2019 టోర్నీలలోనూ ఆడింది.

AFC ఆసియా కప్ క్వాలిఫయర్స్ మూడో రౌండ్‌లో భారత్ తమ తొలి రెండు మ్యాచ్‌లలో కంబోడియా, ఆఫ్ఘనిస్తాన్‌లను ఓడించింది. కంబోడియాపై భారత్ 2-0తో గెలుపొందగా, సునీల్ ఛెత్రీ జట్టు 2-1తో ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తు చేసింది. కంబోడియాపై సునీల్ ఛెత్రీ రెండు గోల్స్ చేశాడు. అదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌పై ఛెత్రీ, సహల్ అబ్దుల్ సమద్ స్కోర్ చేయగలిగారు.

ఇవి కూడా చదవండి

ఆఫ్ఘనిస్తాన్‌పై గోల్స్ చేసిన తర్వాత, భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి ఇప్పుడు 128 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 83 గోల్స్ చేశాడు. క్రియాశీల ఫుట్‌బాల్ ఆటగాళ్లలో క్రిస్టియానో​రొనాల్డో (పోర్చుగల్), లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా) మాత్రమే ఛెత్రీ కంటే ముందున్నారు. రొనాల్డో 189 మ్యాచ్‌ల్లో 117 గోల్స్ చేయగా, మెస్సీ 86 (162 మ్యాచ్‌లు) చేశాడు. హాంకాంగ్‌తో జరిగే మ్యాచ్‌లో సునీల్ ఛెత్రీ కళ్లు మెస్సీ రికార్డుపై నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow Us